దేశీయ మార్కెట్లు గురువారం నష్టాలతో మొదలయ్యాయి. ఈ ఉదయం 11:13 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 39,121.35 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 29.90 పాయింట్లు కోల్పోయి 11,658 వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.69.07గా ఉంది.
విప్రో, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. యెస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, హెచ్సీఎల్ టెక్, ఎమ్ అండ్ ఎమ్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.