గాలిలో విహరించాలనుకునే మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. దాదాపు సెకండ్‌ క్లాసు ఏసీ రైలు ప్రయాణం ఛార్జీలకే విమానంలో వెళ్లవచ్చు.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రయాణీకులకు అద్భుత కబురు అందించింది.

న్యూఢిల్లీ నుంచి జోధ్‌పూర్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌ 5 నుంచి నేరుగా విమాన సర్వీసులను అందించనుంది. ఈ రూట్‌లో విమాన చార్జీలను రూ 1999గా నిర్ణయించింది. జోధ్‌పూర్‌తో పాటు ఢిల్లీ-అగర్తలా, ఢిల్లీ -దిబ్రూగఢ్‌ రూట్లలోనూ డైరెర్ట్‌ ఫ్లైట్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

వచ్చే నెల 14న ఈ రూట్లలో విమాన సర్వీసులు మొదలవుతాయి. ఇక అగర్తలా, దిబ్రూగఢ్‌ రూట్లలో విమాన చార్జీలను వరుసగా 3,9999, 4999లుగా నిర్ణయించింది.
మరోవైపు ఢిల్లీ, ముంబైలను కలుపుతా ఆరు నూతన అంతర్జాతీయ విమానాలను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇండిగో ఎయిర్‌లైన్‌ వెల్లడించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: