పండుగ సీజన్ సమీపిస్తుండంతో  ఎప్పటిలాగే  ప్రముఖ ఆన్ లైన్ విక్రయ సంస్థ  ఫ్లిప్ కార్ట్...  బిగ్ బిలియన్ డేస్  సేల్ ను  ప్రకటించింది. సెప్టెంబర్ 29న ఈ సేల్  ప్రారంభం అయ్యి  అక్టోబర్ 4న ముగియనుంది.  6రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్ లో కొనుగోలు దార్లను ఆకర్షించడానికి భారీ ఆఫర్లను ప్రకటించనుంది ఫ్లిప్ కార్ట్. అందులో  భాగంగా మొబైల్ ఫోన్స్ , టీవీ , స్పీకర్లు , గాడ్జెట్జ్స్ , ఎలక్ట్రానిక్స్ , గృహోపకరణాల ఫై భారీ  డిస్కౌంట్  ఇవ్వనుంది. 


ఈనెల 29న అర్ద రాత్రి 12 గంటలకు  ఈ బిగ్ బిలియన్ సేల్ ప్రారంభం కానుంది. కాగా  ఫ్లిప్ కార్ట్  ప్లస్ సభ్యులకు  నాలుగు  గంటల ముందే ఈ సేల్ ను  యాక్సెస్ చేసుకునే  సదుపాయాన్ని కలిపించింది.  ఇక మొదటి రోజు  సేల్ లో  టెలివిజన్ల ఫై 75 శాతం వరకు ఫ్యాషన్ కు సంబంధించిన వస్తువులఫై అనగా..  షూస్ , గడియారాలు ,  బట్టల ఫై అలాగే   గృహోపకరణాలఫై ఏకంగా 90 శాతం వరకు  డిస్కౌంట్  ఇవ్వనుంది.  రెండవ రోజు నుండి మొబైల్ ఫోన్స్  ,ల్యాప్ టాప్స్ ,  గాడ్జెట్స్ ఫై భారీ డిస్కౌంట్ లను ప్రకటించనుంది. 



అయితే ఈ సేల్ లో  మొబైల్ ఫోన్స్ , ల్యాప్ టాప్స్ ప్రధాన ఆకర్షణ గా  నిలువనున్నాయి.  ఇక అలాగే యాక్సిస్ బ్యాంక్ , ఐసీఐసీఐ  బ్యాంక్ క్రెడిట్ కార్డు లఫై 10 శాతం వరకు ఇన్స్టాంట్   డిస్కౌంట్ లు కూడా ఇవ్వనుంది.  ఇప్పటికే ఈ సేల్ కు సంబందించిన ప్రమోషన్స్ కోసం  అమితాబ్ బచ్చన్ , మహేష్ బాబు, కోహ్లీ  వంటి స్టార్స్ ను ప్రచార కర్తలుగా వాడుకుంటుంది ఫ్లిప్ కార్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం  ఏం ఏం కొనాలనుకుంటున్నారో  విష్ లిస్ట్ చేసి పెట్టుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: