ఈఎంఐ ట్రాన్సాక్షన్స్పైనా ఈ డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్యాషన్, మొబైల్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్పై భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది పేటీఎం. ప్రతీ రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 'ప్రైస్ డ్రాప్' సేల్ ఉంటుంది. సాయంత్రం 8 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు 'ఫ్లాష్ సేల్స్' ఉంటాయి. ఇక స్మార్ట్ఫోన్ కొన్నవారికి స్మార్ట్ స్పీకర్స్, టీవీ కొన్నవారికి సౌండ్బార్ ఉచితం.
ఈ ఫెస్టివల్ సీజన్లో కస్టమర్లకు రూ.100 కోట్ల బెనిఫిట్స్ ఉంటాయని పేటీఎం మాల్ తెలిపింది. ఇక ఫ్యాషన్లో చూస్తే వ్యాన్ హ్యూసేన్, అల్లెన్ సోలీ, ప్యూమా, ఫాస్ట్ట్రాక్ లాంటి బ్రాండ్స్ నుంచి ప్రత్యేకమైన డీల్స్ ఉన్నాయి.బీబా, డబ్ల్యూ, ఔరేలియా లాంటి ఎథ్నిక్ వేర్ నుంచి ప్రత్యేకమైన డిస్కౌంట్స్ ఉంటాయి. ఐఫోన్స్, జేబీఎల్ స్పీకర్స్, ఎంఐ టీవీ, గోప్రో, హెచ్పీ, లెనోవో ల్యాప్టాప్స్, గేమింగ్ ల్యాప్టాప్స్పై ఆకర్షణీయమైన డీల్స్ ఉంటాయి.
మెగా ఫెస్టివల్ సేల్ కోసం ఎల్జీ, సాంసంగ్, షాపర్స్ స్టాప్, బిగ్ బజార్ లాంటి బ్రాండ్స్ 10,000 పైగా ఆథరైజ్డ్ స్టోర్స్తో ఒప్పందం కుదుర్చుకుంటి పేటీఎం. యాపిల్, వివో, ఒప్పో ఆన్లైన్ బ్రాండ్ ఆథరైజ్డ్ స్టోర్స్లో కూడా కొనొచ్చు. రిటర్న్స్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ప్రకటించింది పేటీఎం మాల్. రూ.10,000 వరకు బోనస్ బెనిఫిట్స్ లభిస్తాయి. గోల్డ్ కాయిన్స్ ఆఫర్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ రూ.499 ధరకే ప్రారంభమౌతాయి.