సంక్రాంతి అంటేనే ఆఫర్లు.. అయితే అలాంటిలాంటిది కాకుండా బంపర్ ఆఫర్ ప్రకటించింది ఓ మొబైల్ గొలుసుకట్టు సంస్థ. సంక్రాంతి సందర్భంగా స్క్రాచ్ అండే అండ్ విన్ ఆఫర్ ప్రకటించింది. కొనుగోలుదార్లుకు రూ. 12 కోట్ల విలువ కలిగిన బహుమతులతో పాటు 5 కోట్ల క్యాష్ పాయింట్లు కూడా గెలుచుకోవచ్చని బిగ్ సి సంస్థ ప్రకటించింది.

 

ఈ ఆఫర్ కు వినియోగదార్ల నుంచి మంచి స్పందన వస్తోందట. ఈ స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు, ఎల్ ఈడీ టీవీలు, ల్యాప్ టాప్లు, మైక్రోఒవెన్, ట్రాలీ సూట్ కేస్, మిక్సర్, రైస్ కుక్కర్ వంటి బహుమతులు గెలుచుకోవచ్చట.

 

అంతే కాదు.. కచ్చితమైన క్యాష్ పాయింట్లు కూడా పొందొచ్చట. ఇప్పటికే ఈ బిగ్ సి సంస్థ మొబైల్ యాప్ కూడా విడుదల చేసింది. ఆన్లైన్లో మొబైల్ కొనుగోలు చేస్తే.. 90 నిమిషాల్లోనే డోర్ డెలివరీ అందిస్తున్నారు. తమ షాపుల్లో ఎంఐ, టీసీఎల్ స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: