జియో.. ఎప్పుడు సంచలనమే. జియో ఓ కొత్త ప్లాన్ తీసుకుంది అంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. మళ్ళి ఎం నిర్ణయం తీసుకుంది రా బాబు అని తలలు పట్టుకుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్లాన్స్ తీసుకొచ్చి ప్రజలకు ఆర్ధికంగా సహాయ పడుతుంది జియో. ప్రజల డబ్బులను ఫోన్ కాల్స్ రీచార్జ్ పేరుతో దోచేస్తున్న నెటవర్క్స్ అన్నింటికీ ఎప్పటి నుండో షాక్ ఇస్తూ వస్తుంది ఈ నెట్వర్క్..

 

అయితే ఈ నేపథ్యంలోనే జియో వినియోగదారులకు మరో సర్ ప్రైజ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ఒప్పో ఎఫ్15 స్మార్ట్ ఫోన్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో అదిరిపోయే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఆ స్పెసిఫికేషన్లే కాదు మరో అదిరిపోయే బంపర్ ఆఫర్ కూడా ఉంది. అది ఏంటి అంటే... 

 

జనవరి 26వ తేదీ లోపు ఈ ఒప్పో ఎఫ్15 స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేవారికి వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్ మెంట్ వస్తుంది. ఆఫ్ లైన్ రిటైలర్ల వద్ద హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసేవారికి ఐదు శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. వీటన్నిటితో పాటు ఈ ఫోన్ కొనుగోలు చేసే జియో వినియోగదారులకు 100 శాతం అదనపు డేటా లాభాలు అందించనున్నారు.

 

దీంతో ఈ ఫోన్ కొనుగోలుకు అందరూ తొందరపడుతన్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు అన్ని కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం 19,990 రూపాయిలుగా నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: