బంగారం సామాన్యుడికి బహుదూరమైంది. బంగారం ధర షాపులో ఇప్పుడు 40 వేలు.. కానీ మనం అది కొనడానికి వెళ్తే 50 వేలు.. ఎందుకు ఏమి అని అడిగితే.. ఆ షాపు వాళ్ళు చెప్పే మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే.. ఆలా ఉంటాయి వాళ్ళ మాటలు. మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి.. ఆ ఛార్జెస్ ఉంటాయి అని చెప్పి 10వేలు ఎక్సట్రా తీసేసుకుంటారు. అది వారి కూలి.. కానీ ఇక్కడ కొనేవారికి మాత్రం గుండెపోటు.. 

 

ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 10 రూపాయిల పెరుగుదలతో 41,770 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 38,290 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర స్థిరంగా కొనసాగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 49,500 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగింది. 

 

అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా పెరగటంతో బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. సామాన్యులకు అందనంత దూరంలో బంగారం ధరలు చేరాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: