రెండు రోజుల తగ్గుదలకు నేడు బ్రేకులు పడ్డాయి... ఆ బ్రేకులు కొంత స్వలపంగనే పడ్డాయి లెండి. బంగారం సామాన్యుడికి బహుదూరమైంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కారణంగా బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపించాయి. బంగారంతో పాటు ముడి చమురు ధరలు కూడా ఆకాశానికంటుతున్నాయి. ఇంకా డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా బలహీనపడుతోంది.

 

ఈ నేపథ్యంలోనే నేడు బుధువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 160 రూపాయిల పెరుగుదలతో 41,670 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 160 రూపాయిల పెరుగుదలతో 38,360 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా అదే భాటలోనే పరుగులు పెట్టింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 100 రూపాయిలు పెరుగుదలతో 49,600 రూపాయిలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా పెరగటంతో బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ భారీగా పెరగడంతో బంగారం ధరలు పెరిగాయి. సామాన్యులకు అందనంత దూరంలో ప్రస్తుతం బంగారం ధరలు చేరాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: