బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆ బంగారం ధరలు చూస్తే షాక్ కి గురవ్వడం ఖాయం. 150 రూపాయిలు తగ్గుతుంది.. 900 వందలు పెరుగుతుంది. ఇలా రోజు రోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు అయితే మరి దారుణం. ఏకంగా 900 రూపాయిలు పెరిగింది. 

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఇప్పట్లో సాధారణ స్థితికి రావు అని అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,020 రూపాయిల పెరుగుదలతో 46,160 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 950 రూపాయిల పెరుగుదలతో 42,310 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 1,230 రూపాయిల తగ్గుదలతో 51,080 రూపాయిలకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారం, వెండిపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: