దేశ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ అదరగొడుతుంది.. కరోనా వైరస్ ఏ కాదు.. ఇంకా ఎలాంటి ఎఫెక్ట్ మమ్మల్ని ఎం చెయ్యలేదు అన్నట్టు ఆర్ధిక ఫలితాలు వెల్లడించి అందర్నీ ఆశ్చర్య పరిచింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం జనవరి మార్చి కి రూ.6927 కోట్ల లాభాన్ని నమోదు చేసినట్టు ప్రకటించింది.
2018-19 ఆర్థిక సంవత్సరపు క్యూ4లో బ్యాంక్ నికర లాభం రూ.5885 కోట్లుగా ఉంది. అంటే దీని బట్టి చూస్తే బ్యాంక్ నికర లాభం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 శాతం పెరిగింది. అంతేకాదు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆదాయం కూడా రూ.15,204 కోట్ల కు చేరింది. ఇంకా డిపాజిట్లు కూడా 24.3 శాతం పైకి కదిలాయి. ప్రస్తుతం బ్యాంకు నిర్వహణ కూడా రూ.8277 కోట్లుగా ఉంది.
ఇంకా బ్యాంకు రుణ నాణ్యత కూడా బాగానే మురుగుపడింది అని చెప్పాలి. స్థూల ఎన్పీఏలు 5.8 శాతం తగ్గుదలతో రూ.12,650 కోట్లకు దిగివచ్చింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే కేటాయింపు ఏకంగా రెట్టింపు అయ్యింది.. ఏది ఏమైనా కర్ణ వైరస్ సమయంలో కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అదరగొట్టింది అనే చెప్పాలి.
.@HDFC_Bank to announce #Q4 earnings for the quarter ending march 31, 2020 today. #HDFCBankQ4FY20 pic.twitter.com/2F6fb6PZSM
— hdfc bank news (@HDFCBankNews) April 18, 2020