దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలలో కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బెంచ్‌ మార్క్ సూచీలు సోమవారం కాస్త పైకి కదిలాయి. దీనితో సూచీలు నేడు తీవ్ర ఊగిసలాటకు గురయ్యాయి. అయితే చివరకు మాత్రం మార్కెట్ లాభాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇక ఇంట్రాడేలో BSE సెన్సెక్స్ 468 పాయింట్లు లాభపడి, 32,056 పాయింట్ల గరిష్టాన్ని చేరుకోనుంది. ఇక NSE నిఫ్టీ కూడా 9391 పాయింట్ల గరిష్టానికి చేరుకొని  చివరకు సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 31,648 పాయింట్ల వద్ద, నిఫ్టీ 0.2 పాయింటు లాభంతో 9267 పాయింట్ల వద్ద ముగిసాయి. 

 

ఇక నేటి మార్కెట్ విశేషాలకు వస్తే ... నిఫ్టీ 50లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా షేర్లు లాభాల బాట పడ్డాయి. ఇక టాటా మోటార్స్ 4% పైగా పెరిగింది. ఇక  అదేసమయంలో  యాక్సిస్ బ్యాంక్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో, JSW స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఇందులో హిందాల్కో కంపెనీ ఏకంగా 6% నష్ట పోయింది.

 


ఇక నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లన్నీ కాస్త మిశ్రమంగానే ముగిసాయి. ఇందులో ముక్యంగా నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. ఇందులో నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 4% పైగా లాభపడింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3% పైగా నష్టపోయింది. ఇక అమెరికా డాలర్‌ తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 13 పైసలు నష్టంతో 76.54 వద్ద ట్రేడ్ అవుతుంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరలు కాస్త తగ్గాయి. ఇందులో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌ కు 3.74% తగ్గుదలతో 27.05 డాలర్లకు చేరగా, WTI క్రూడ్ ధర బ్యారెల్‌ కు 9.03% క్షీణతతో 22.79 డాలర్లకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: