నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్తా లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా బెంచ్ మార్కెట్ సూచీలు అన్ని ఈరోజు బాగా పరుగులు పెట్టాయి చెప్పవచ్చు. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఒకానొక దశలో లాభాలు బాగా ఉన్నా చివరి గంటలో బ్యాంకు షేర్లలో అమ్మకాల కారణంగా కాస్త లాభాలు తగ్గాయి అని చెప్పవచ్చు. ఇక ఇంట్రాడే సెషన్లలో సెన్సెక్స్ 370 పాయింట్లు పెరగగా నిఫ్టీ కూడా 91 79 పాయింట్లకు చేరుకుంది. అయితే ఇక చివరి గంటలో మాత్రం బ్యాంకింగ్ షేర్లు అమ్మడంతో కాస్త లాభాలు తగ్గాయి అని చెప్పవచ్చు. అయితే చివరగా BSE సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 30,933 వద్ద, అలాగే NSE నిఫ్టీ కేవలం 40 పాయింట్లు లాభంతో 9106 పాయింట్ల వద్ద ముగిసాయి.

 

ఇక నేటి మార్కెట్ విషయాలకు వస్తే... నిఫ్టీ 50లో  ఏసియన్ పెయింట్స్, హీరో మోటొకార్ప్, మారుతీ సుజుకీ, ITC, హిందాల్కో షేర్లు బాగా లాభపడ్డాయి. ఇందులో ITC ఏకంగా 7 % పైగా పరుగులు పెట్టింది. ఇక అదేసమయంలో ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, NTPC షేర్లు నష్టపోయాయి. ఇందులో బజాజ్ షేర్లు 3 % నష్ట పోయాయి. ఇక నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్ ‌లన్నీ కూడా మిశ్రమంగా ముగిసాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్, నిఫ్టీ బ్యాంక్ ‌లు మినహా మిగతా సూచీలన్నీ లాభాలో ముగిసాయి. నిఫ్టీ FMCG, నిఫ్టీ ఆటో ఇండెక్స్ ‌లు 2 % పైగా ర్యాలీ అవ్వగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ మీడియా సూచీలు 1 % శాతం లాభపడ్డాయి.


ఇక ఇదే క్రమంలో అమెరికా డాలర్ ‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి కొద్దీ లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ఇక 18 పైసలు లాభంతో 75.62 వద్ద ట్రేడ్ అవుతుంది.  ఇక అంతర్జాతీయ మార్కెట్ ‌లో  ముడి చమురు ధరలు కాస్త పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.96 % పెరగగా 36.45 డాలర్లకు, WTA క్రూడ్ ధర బ్యారెల్ ‌కు 2.12 % పెరుగుదలతో 34.21 డాలర్లకు చేరుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: