ఈ మధ్యకాలంలో ఆటో మొబైల్ సంస్దలు బలే అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నాయి. అలాంటి అద్భుతమైన మరో ఆఫర్ ను తీసుకొచ్చింది దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ కస్టమర్లను ఆకర్షించేందుకు మారుతీ మరో బ్యాంక్‌తో జతకట్టింది. దీంతో మరింత మందికి దగ్గర కావాలని చూస్తుంది. 

 

అయితే బ్యాంక్ సాయంతో ఆకర్షణీయమైన అద్భుతమైన ఫైనాన్స్ స్కీమ్స్ అందిస్తోంది. ఇండస్ఇండ్ బ్యాంక్‌తో మారుతీ సుజుకీ జత కట్టింది. కస్టమర్లకు ఎన్నో ఈఎంఐ స్కీమ్స్‌ను ఈ మారుతీ సుజుకి ఆఫర్ ఇస్తుంది. ఏంటి అంటే? మొదట మూడు నెలల వరకు లక్ష రూపాయలకు గాను రూ.899 ఈఎంఐ స్కీమ్ ను అందిస్తుంది. 

 

ఇంకా ఇందులో స్టెపప్ స్కీమ్‌లో కూడా ఈఎంఐ రూ.లక్షకు రూ.1,800 నుంచి ప్రారంభమౌతుంది. అంతేకాదు ఇన్‌కమ్ ప్రూఫ్ ఉన్న వారికి కారు ధరకు సమానమైన మొత్తం రుణం రూపంలో వస్తుంది. అయితే మారుతీ సుజికి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ వారికీ ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రముఖ ఫైనాన్స్ పార్ట్‌నర్స్‌లో ఒకటి అని చెప్పారు. 

 

అంతేకాదు కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్ హెడ్ ఎస్‌.వి. పార్థసారథి మాట్లాడుతూ.. కొత్తగా కారి కొనాలి అని అనుకునే వారికీ 
ఆకర్షణీయ ఫైనాన్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ స్కీమ్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి.                                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: