ఇండస్ ఇండ్ బ్యాంక్లో వాటాదారులైన హిందుజా సోదరుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో షేర్ల విక్రయాన్ని పరిశీలిస్తున్నట్లు బ్లూమ్బెర్గ్ కథనంలో పేర్కొన్నారు.కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ వాటాలను కొనడానికి సిద్ధమైనట్లు వార్తలు గుప్పుమన్నాయి. తొలి దశ చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (IndusInd bank మాతృ సంస్థ) సోమవారం (అక్టోబర్ 26) ఓ ప్రకటన విడుదల చేసింది. బ్యాంక్ విలీనం చేయనున్నారనే వార్త అసత్యమని పేర్కొంది. ఇండస్ ఇండ్ బ్యాంక్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని బ్యాంక్ ప్రమోటర్లయిన హిందుజా సోదరులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విలీనం వార్తలను కొట్టిపారేసిన తర్వాత మరో వార్త గుప్పుమంటోంది. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందనే ఉదయ్ కొటక్ వెనక్కి తగ్గారని కొంత మంది చర్చించుకుంటున్నారు. ఇండియన్ ఎకానమీని ఆయన చూసే కోణం మరోలా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఇండస్ ఇండ్ మరియు కోటక్ మహింద్ర బ్యాంకుల విలీన వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది.