ఈ నిర్ణయం తో ఈ కార్డులు వాడే వారికి మంచి లాభాలు ఉన్నాయని తెలుస్తుంది..కాంటాక్ట్లెస్ కార్డుల ట్రాన్సాక్షన్ లిమిట్ను పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000 వరకు పెంచుతున్నట్లు వివరించింది.. మరో విషయమేంటంటే పిన్ ఎంటర్ చేయకుండానే 5 వేలకు పైగా లావాదేవీలను చేసుకోవచ్చు..ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అందుబాటు లోకి వస్తాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు వారి కస్టమర్లకు కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు సులభంగానే లావాదేవీలు చేయొచ్చు..
కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.మరోవైపు రిజర్వు బ్యాంక్ మరో కీలక అంశాన్ని కూడా వెల్లడించింది. ఆర్టీజీఎస్ లావాదేవీలు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నిర్ణయం అందుబాటులోకి వచ్చిన పిమ్మట బ్యాంక్ కస్టమర్లు ఎప్పుడైనా ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు పంపించొచ్చు... మొత్తానికి కార్డు వినియోగ దారులకు ఇది చక్కటి శుభవార్త..