అమెజాన్ ఇండియా గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లను ప్ర‌క‌టించింది. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ను ప్ర‌క‌టించింది.  జనవరి 20 నుంచి జనవరి 23 వరకు ఈ సేల్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు ఓ రోజు ముందే రాత్రి 12 గంటల నుంచే ఈ సేల్ ఆఫర్లను పొందే అవ‌కాశం క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం. ఆఫర్ ‌తో పాటు ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, క్రెడిట్ ఈఎంఐల మీద అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభించ‌నుంది.  అలాగే, బజాజ్ ఫిన్‌సర్వ్, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డు, అమెజాన్ పే లేటర్ కార్డులు, కొన్ని సెలక్ట్ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల మీద కూడా అదనపు ఆఫర్లు ఉన్నాయి. ల్యాప్ టాప్స్, హెడ్‌ఫోన్లు, నెట్ వర్క్ వస్తువులు, పర్సనల్ కంప్యూటర్ల మీద ఆఫర్లు ఉన్నాయి.


అమెజాన్ ఎక్సేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. OnePlus 8T 5g, samsung Galaxy M51, redmi Note 9 Pro Max, samsung Galaxy M31 Prime, iphone 12 mini లాంటి వాటిపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. అలాగే, OnePlus 8 5g, samsung Galaxy M21, iphone 7, nokia 5.3, xiaomi redmi Note 9 లాంటి వాటిపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. మరోవైపు ల్యాప్‌ టాప్ ‌ల పై రూ.30,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హెడ్ ఫోన్స్ మీద 75 %, ట్యాబెట్ల మీద 45 % డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇక స్మార్ట్ ఫోన్ల మీద 70 %, కొన్ని కెమెరాల మీద 60 % డిస్కౌంట్ లభించనుంది.


కేవలం స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ పైనే కాకుండా గృహోపకరణాల మీద కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లు కూడా తక్కువ ధరలకు లభించనున్నాయి. తాజాగా లాంచ్ చేసిన sony wallet PLATFORM' target='_blank' title='digital-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>digital Vlog Z-1 కూడా ఆఫర్‌ లో లభించనుంది. వీటితో పాటు రూటర్లు, కెమెరాలు, సౌండ్ బార్లు, మానిటర్లు కూడా డిస్కౌంట్‌ లో లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: