సాధారణంగా విమానంలో ఎగరాలి అంటే చాలా డబ్బు ఉండాలి. విమానంలో టికెట్ కొనాలంటే సామాన్యుడికి సగటు నెల జీతం. అంత ఖర్చుతో కూడుకున్న విమాన ప్రయాణం సామాన్యుడికి తీరని కోరికగా మిగిలిపోయింది. అయితే త్వరలోనే సామాన్యుడి  నెరవేరబోతోంది. స్పైస్ జెట్ ఐదురోజులపాటు బుక్ బేఫికర్ సెల్ను కొనసాగిస్తోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ సేల్ జనవరి 17 అర్ధరాత్రి వరకు ఉంటుంది. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించాలనుకునేవారు కేవలం రూ.899 రూపాయలకే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

హైదరాబాద్  - బెళగావి,బెళగావి  - హైదరాబాద్, శ్రీనగర్ - జమ్మూ,జమ్మూ -శ్రీనగర్,బెంగళూరు - చెన్నై,చెన్నై - బెంగళూరు,అహ్మదాబాద్ - జైసల్మేర్,జైసల్మేర్ - అహ్మదాబాద్ వంటి రూట్స్ లో కేవలం రూ.899 రూపాయలకే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని స్పైస్జెట్ కల్పించింది. ఇక టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు https://www.spicejet.com/ ఈ వెబ్సైట్ ద్వారా అన్ని విషయాలను తెలుసుకోవచ్చు.
అంతే కాకుండా మరొక స్పెషల్ ఆఫర్ ని కూడా స్పైస్జెట్ అందిస్తోంది. ప్రతి ప్రయాణికుడికి వెయ్యి రూపాయలు వోచర్ ను అందిస్తుంది.


ఈ రూ.1000 రూపాయల ఓచర్ ను 2021 ఫిబ్రవరి 28 లోగా ఉపయోగించుకోవాలి. 2021 ఏప్రిల్ ఒకటి నుంచి 2021 సెప్టెంబర్ 30 ల  మధ్య బుక్ చేసుకునే ఫ్లైట్ లకు ₹1000  వోచర్ వర్తిస్తుంది. ఇక వీటితో పాటు ఫ్లైట్ చేంజ్, క్యాన్సిలేషన్ చార్జీలను ఒకసారి మినహా ఇస్తోంది. కాబట్టి ప్రయాణికులు తమ ఫ్లైట్ టికెట్లను ఎలాంటి చార్జీలు లేకుండా మాడిఫై చేసుకోవచ్చు.లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే ఫ్లైట్ డిపార్చర్ తేదీ కన్నా 21 రోజుల ముందే మోడీపై లేదా క్యాన్సిల్ వర్తిస్తుంది. వీటితోపాటు రూ. 149 ప్రిఫర్ బోర్డింగ్, బ్యాగ్ ఔట్  సర్వీస్, రూ.249 ధరకు మీల్స్,రూ.799 ధరకు స్పైస్ మాక్స్ అప్గ్రేడ్ పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: