12వ తేదీ వరకు
ఈ కార్నివాల్ ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది. ఐఫోన్ ఎస్ఈ (2020) 64 జీబీ మోడల్, 128 జీబీ ఆప్షన్ ధరను రూ.34,999 నుంచి రూ. 29,999కి తగ్గించింది. ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధరను రూ. 45,984 నుంచి రూ.38,999కి తగ్గించింది. 128 జీబీ మోడల్ ధరను రూ.43,999కి ఇస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ పై రూ. 5 వేల రాయితీ, పాత ఫోన్ల ఎక్స్చేంజ్పై ఫ్లిప్కార్ట్ అదనంగా రూ.7 వేల రాయితీ ఇస్తోంది. రెడ్మి 9 ప్రొ మ్యాక్స్పై రూ.2 వేలు తగ్గించడంతో రూ.14,999 నుంచి అందుబాటులో ఉంది. మోటో జి 5జిని రూ. 21,200కు, ఫ్లిప్కార్ట్ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై అదనంగా రూ. 2 వేల రాయితీ ఇస్తోంది. ఐక్యూ 3ని రూ. 24,990కి విక్రయానికి పెట్టింది. నెలకు రూ. 4,998తో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఆఫర్ చేస్తోంది.
స్మార్ట్ఫోన్ కార్నివాల్లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41పై రూ. 1500 రాయితీని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ 64 జీబీ మోడల్ ధర రూ. 15,999గా పేర్కొనగా, రూ. 128 జీబీ మోడల్ను రూ. 16,4999కి ఇస్తున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మి సి12 3జీబీ ర్యామ్+32 జీబీ వేరియంట్పై రూ. 500 రాయితీ ప్రకటించారు. రూ.8,4999కి అందుబాటులో ఉంది.