మహిళలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది. ఇప్పటివరకు మహిళల అభివృద్ధి కోసం ఎన్నో రకాల కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. మహిళల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ కొత్త పథకాలను అమలు చేస్తుంది. ఈ మేరకు కేంద్రం మరోసారి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల నుంచి సామాన్య మహిళల వరకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పలు రకాల పథకాలను అమలులోకి తెచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు రూ.5000 అందిస్తోంది. ఇప్పటికే ఈ పథకంలో అనేక మంది మహిళలు చేరారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రూ.5000 నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయి. అయితే ఈ డబ్బులన్ని ఒకేసారి రావు. ఇవి కూడా విడతల వారీగానే మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి చేరతాయి. అయితే ఈ పథకం కేవలం ప్రెగ్నెంట్ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది.


ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ పథకం అనేది 19 ఏళ్ల పైన ఉన్న గర్భిణీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఈ పథకం విషయానికొస్తే.. ఇందులో తొలి విడతలో భాగంగా రూ.1000 వస్తాయి. ఆ తర్వాత రెండో విడత కింద రూ.2 వేలు లభిస్తాయి. అలాగే చివరి విడతలో మారో రూ.2 వేలు వస్తాయి. ఇలా మొత్తం రూ. 5 వేలు మహిళల బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరతాయి. ఇందులో మరో విషయం గుర్తుంచుకోవాలి. ఎవరతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్నారో వారికి ఈ పథకం వర్తించదు.. ఆన్‌లైన్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఆశా వర్కర్ మిమ్మల్ని ఈ స్కీమ్‌లో చేర్పిస్తారు. www.Pmmvy-cas.nic.in లింక్ ద్వారా మీరు నేరుగా స్కీమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. అక్కడ బెనిఫీషియరీ లాగిన్ అని ఉంటుంది. రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: