టాటా కంపెనీకి మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని.. అందుకే ఈ నియామకాల ప్రక్రియ చేపడుతున్నట్టు సీఈఓ రాజేష్ గోపినాథన్ వెల్లడించారు. ప్టెంబర్ 30, 2021 నాటికి 5.28 లక్షల మంది ఉన్నారని, అందులో మహిళలు 36.2 శాతం మహిళలున్నారని తెలిపారు. రెండో త్రైమాసికంలో ముగిసిన ఫలతాలను తాజాగా విడుదల చేసింది. అందులో 9,624 కోట్ల లాభం వచ్చినట్టు నివేదికలో వెల్లడించారు. వృద్ధిని 14.1 శాతం నమోదు అయింది. దీంతో సంస్థ ఆదాయం 16.7 శాతం పెరిగింది. రూ. 46,867కోట్లు చేరుకున్నది. గత ఏడాది ఇదే సమయంలో రూ. 40,135 కోట్ల ఇన్కమ్ వచ్చింది. దీంతో రూ. 8,433 కోట్ల నికర లాభం వచ్చినట్టు ప్రకటించారు.
దాదాపు శతాబ్ద కాలం నుంచి తమ సంస్థను అభివృద్ది చేసుకుంటూ వస్తున్నామని.. సీఈవో ఎండీ రాజేశ్ గోపినాథన్ తెలిపారు. సంస్థను బలంగా అభివృద్ధిలో ముందు ఉంచేందుకు పదేండ్లకు ఒకసారి వచ్చే అవకాశం అని వెల్లడించారు. తమ బ్రాండ్ బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని.. ఐదేళ్లపాటు రాజేష్ ను ఎండీ, సీఈవో గా నియమించడానికి బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం మంది రెండు టీకాలు వేయించుకున్నారని యాజమాన్యం వివరించింది. ఇప్పటికే చాలా మంది ఇంటి వద్ద పని చేస్తున్నారని.. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగులందరూ తిరిగి ఆఫీసులకు వచ్చి వర్క్ చేస్తారని తెలిపారు.