ఈ విధానంలో కూడా కాస్త సమయం పడుతుంది అనేది వాస్తవం. ఇచ్చిన ధ్రువపత్రాలు సరిగా ఉన్నది లేనిది చూసుకోవాల్సి వస్తుంది. అనంతరం ఇతర ప్రక్రియ పూర్తిచేసి అప్పుడు పాన్ కార్డు జారీ చేయడం మొదలుపెడతారు. దీనిని కూడా సరళ తరం చేసేందుకు e-పాన్ విధానం తెచ్చేసింది ఆదాయపుపన్ను శాఖ. తద్వారా జారీ విధానంలో ఉన్న సమయం కూడా తగ్గిపోతుంది. కానీ ఒక్క షరతు మాత్రం ఉంది, అదే ఆధార్ అనుసంధానం(దీనికి కూడా మొబైల్ నెంబర్ అనుసంధానం అయి ఉండాల్సి ఉంది). దరఖాస్తు చేయు వ్యక్తి మేజర్ అయి ఉండాలి.
e-పాన్ సులభంగా పొందే విధానం :
-------------------------------------------
* ఆదాయపు పన్ను వెబ్ సైట్ లో కి వెళ్లాల్సి ఉంటుంది. https://eportal.incometax.gov.in/iec/foservices/#/login
* వ్యక్తిగత సేవల టాబ్ లో తక్షణ e-పాన్ పై క్లిక్ చేయాలి
* e-పాన్ పేజీ లో గేట్ e-పాన్ పై క్లిక్ చేయండి.
* ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
* వెంటనే మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది, దానిని నమోదు చేయాల్సి ఉంది.
* అనంతరం ఫోటో, ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి.
* వివరాలు అన్ని సరిగా ఉన్నాయా అని ఒకసారి పరిశీలించుకుని, దరఖాస్తు సమర్పించాలి.
* అనంతరం భవిష్యత్తు లో ఉపయోగించడానికి దరకాస్తు నెంబర్ వస్తుంది, దానిని జాగర్త చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది పూర్తి ఉచిత సేవగా ఆదాయపుపన్ను శాఖ అందిస్తున్నది, ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ సేవలు మీరు ఇతర ప్రభుత్వ సేవా సంస్థలు అయినటువంటి ఈ-సేవ, సచివాలయాలు నుండి పొందగోరవచ్చు. ప్రైవేట్ సేవా సంస్థలు కొంత మొత్తం రుసుము అడగవచ్చు. ఈ విధానం ద్వారా జారీ చేయబడిన e-పాన్ సాధారణ పాన్ లాగానే అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఈ e-పాన్ వచ్చిన తరువాత ఈ-కేవైసీ వివరాలు ఆధారంగా ఆయా ఖాతాను తెరవవచ్చు.