ఆపిల్ ఫోన్లు అంటే సౌకర్యానికి, స్టేటస్ కు కూడా గుర్తు. కంపెనీతో అదో రిలేషన్ షిప్. ఒక్కసారి ఐ ఫోన్ కొన్నారంటే ఇక ఎప్పటికీ దాసోహం అనాల్సిందే.ఈ ఫోన్ యూత్‌కు బ్రాండ్.ఈ బ్రాండ్ ఫోన్ జీవితంలో ఒక్కసారైన వాడాలని ప్రతి వారు కలలు కంటారు. ప్రపంచమంతా ఒకటే క్రేజ్ అందుకే ఇండియాలో కూడా వీటికి మహా డిమాండ్, ఆపిల్ కంపెనీ నుంచి వచ్చే ప్రతి కొత్త మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన తోలి రోజే సొంతం చేసుకోవాలని కలలు కంటారు. ముఖ్యంగా ఐఫోన్ సిరీస్ మొబైల్ ఫోన్లకు డిమాండ్ చాలా ఎక్కువ. అయితే, ఇప్పటివరకు ఆపిల్ సంస్థ తమ ఉత్పత్తులను అమెరికాలో డిజైన్ చేసి చైనా లో తయారు చేస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకొని భారత్ సహా ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తోంది.


కానీ ఇకపై ఆపిల్ ఫోన్లు ఇండియా లోనే తయారు కాబోతున్నాయి. ఇక త్వరలోనే ఆపిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ది ఎకనామిక్ టైమ్స్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. దీంతో త్వరలోనే మనం మేడ్ ఇన్ ఇండియా ఆపిల్ ఐఫోన్ ను వాడబోతున్నామన్నమాట. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చైనా లో వివిధ రంగాల్లో పనిచేస్తోన్న అమెరికా కంపెనీలను ఆ దేశం వీడాల్సిందిగా అల్టిమేటం జారీ చేసారు. ఈ నేపథ్యంలో అమెరికా కంపెనీలు చైనా కు ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ప్రపంచంలోనే ఐదు అతిపెద్ద వినియోగ మార్కెట్లలో ఒకటైన భారత్ వాటికి ఆకర్షణీయంగా కనిపించిందట. ఇందుకోసం తమిళనాడులోని శ్రీపెరంబుదూరు వేదిక అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.


అయితే, ముంబైలో అతి పెద్ద ఆపిల్ స్టోర్ నెలకొల్పాలని కూడా కంపెనీ తలపోస్తున్నట్లు కేంద్ర మంత్రి హింట్ ఇచ్చారు. అదే సమయంలో ఇప్పటికే భారత్లో మొబైల్స్ తయారు చేస్తున్న ఫాక్స్ కాన్ రెండో, మూడో తయారీ యూనిట్ కూడా నెలకొల్పే అవకాశం ఉంది. స్యాంసంగ్  కూడా చైనా నుంచి తరలి రానుంది. కస్టమ్స్ సుంకం 5% కూడా రద్దు చేయడటం తో మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే హైదరాబాద్ కేంద్రంగా ఆపిల్ తన కార్యకలాపాలు కొనసాగించనుందట. ఇందులో మ్యాప్ డెవలప్మెంట్ కార్యకలాపాలు కూడా ఉండనున్నాయి. అయితే, తయారీ కి మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ సిటీ లేదా తమిళ నాడు లోని శ్రీపెరంబుదూరు ను ఎంచుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


ఇక ఈ ఆపిల్ ఫోన్లు భారత్ లోనే తయారు చేస్తే వాటి ధరలు కొంత మేరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై కస్టమ్స్ సుంకం విధిస్తారు. దీంతో ఆ మేరకు భారం వినియోగదారులపై పడుతుంది. కానీ భారత్ లోనే తయారు చేస్తే మాత్రం కస్టమ్స్ సుంకం పన్నులు ఏమి ఉండవు. అందుకే, ధరలు కనీసం 5 శాతం నుంచి 10% వరకు తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక అప్పుడు దాదాపుగా ప్రతివారు జీవితంలో ఎప్పుడైన ఆపిల్ ఫోన్ కొని తమ కల నెరవేర్చుకోవచ్చూ..

మరింత సమాచారం తెలుసుకోండి: