రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్
కమ్యూనిషన్స్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అనూప్ సింగ్ గురువారం శ్రీసిటీని
సందర్శించారు. హెచ్ ఎస్ బి సి సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు
రాష్ట్రం ఇస్తున్న రాయితీలను వివరించేందుకు ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో
పాల్గొనేందుకు వస్తూ ఆయన శ్రీసిటీ పర్యటనకు వెళ్లారు.
శ్రీసిటీ
ప్రతినిధులతో సమావేశమై క్షుణ్ణంగా పలు వివరాలు తెలుసుకోవడంతో పాటు, తన పలు
సందేహాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూశారు. రైజింగ్
స్టార్ మొబైల్స్ ఇండియా లిమిటెడ్ (ఫాక్స్ కాన్), ఫ్లెక్ట్రానిక్స్ పరిశ్రమలను
సందర్శించారు. ఇక్కడ దాదాపు పదివేలకు పైగా గ్రామీణ మహిళలు అంతర్జాతీయ బ్రాండ్
మొబైల్ ఫోన్లను తయారు చేస్తున్నారు.
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్
రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు , శ్రీసిటీ ప్రత్యేకతలు, పారిశ్రామిక ప్రగతి గురించి
వివరించారు. శ్రీసిటీ ప్రపంచశ్రేణి మౌళిక వసతుల పట్ల ఆకర్షితులైన అనూప్
సింగ్, ఇంతటి భారీ పారిశ్రామికవాడ ఏర్పాటుకు శ్రమించిన శ్రీసిటీ యాజమాన్యాన్ని
అభినందించారు.
ఇక్కడ నెలకొన్న విస్తారమైన ఉద్యోగ అవకాశాలపై, ప్రత్యేకించి ఫాక్స్
కాన్ లో పెద్దఎత్తున మహిళా ఉద్యోగాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర
రెడ్డి దశాబ్దపు క్రితం ప్రారంభించిన పారి శ్రామిక పార్కు శ్రీసిటీలో దాదాపు 40 వేల
మందికి ఉపాధి కలిగింది.
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనిషన్స్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అనూప్ సింగ్ గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రత్యేకతలు, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. హెచ్ ఎస్ బి సి సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు రాష్ట్రం ఇస్తున్న రాయితీలను వివరించేందుకు ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు వస్తూ ఆయన శ్రీసిటీ పర్యటనకు విచ్చేశారు.
శ్రీసిటీ ప్రతినిధులతో సమావేశమై క్షుణ్ణంగా పలు వివరాలు తెలుసుకోవడంతో పాటు, తన పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూశారు. రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా లిమిటెడ్ (ఫాక్స్ కాన్), ఫ్లెక్ట్రానిక్స్ పరిశ్రమలను సందర్శించారు.
శ్రీసిటీ ప్రపంచశ్రేణి మౌళిక వసతుల పట్ల ఆకర్షితులైన అనూప్ సింగ్, ఇంతటి భారీ పారిశ్రామికవాడ ఏర్పాటుకు కృషిచేసిన శ్రీసిటీ యాజమాన్యాన్ని అభినందించారు. ఇక్కడ నెలకొన్న విస్తారమైన ఉద్యోగ అవకాశాలపై, ప్రత్యేకించి ఫాక్స్ కాన్ లో పెద్దఎత్తున మహిళా ఉద్యోగాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు.
శ్రీసిటీని సందర్శించినందుకు మరియు దాని గురించి తెలుసుకోవటానికి చాలా ఆసక్తి చూపినందుకు రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనిషన్స్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అనూప్ సింగ్ గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రత్యేకతలు, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. హెచ్ ఎస్ బి సి సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు రాష్ట్రం ఇస్తున్న రాయితీలను వివరించేందుకు ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు వస్తూ ఆయన శ్రీసిటీ పర్యటనకు విచ్చేశారు.
శ్రీసిటీ ప్రతినిధులతో సమావేశమై క్షుణ్ణంగా పలు వివరాలు తెలుసుకోవడంతో పాటు, తన పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూశారు. రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా లిమిటెడ్ (ఫాక్స్ కాన్), ఫ్లెక్ట్రానిక్స్ పరిశ్రమలను సందర్శించారు.
శ్రీసిటీ ప్రపంచశ్రేణి మౌళిక వసతుల పట్ల ఆకర్షితులైన అనూప్ సింగ్, ఇంతటి భారీ పారిశ్రామికవాడ ఏర్పాటుకు కృషిచేసిన శ్రీసిటీ యాజమాన్యాన్ని అభినందించారు. ఇక్కడ నెలకొన్న విస్తారమైన ఉద్యోగ అవకాశాలపై, ప్రత్యేకించి ఫాక్స్ కాన్ లో పెద్దఎత్తున మహిళా ఉద్యోగాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు.
శ్రీసిటీని సందర్శించినందుకు మరియు దాని గురించి తెలుసుకోవటానికి చాలా ఆసక్తి చూపినందుకు రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.