సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే కొన్ని ఘటనల విషయంలో ఏమీ చేయలేము. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన అబ్బాయిని చంపాలని అనుకున్న అమ్మాయి కథ ఇది. అసలు ఏంటీ స్టోరీ ఏంటీ అనేది చూస్తే... కర్ణాటకలోని కొడగు జిల్లాలో నివాసం ఉండే సుప్రియ అనే అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. కాని అతనికి ఆస్తి లేదు. ఈమెకు అమెరికా వెళ్ళాలి అనే కోరిక ఉంది. ఇద్దరు 2017 తర్వాత ప్రేమలో పడ్డారు.

ఇప్పుడు ఇద్దరు చదువులు అయిపోయాయి అమెరికా వెళ్ళడానికి సుప్రియ రెడీ అయింది. కాని ఆమెకు మాత్రం వెళ్ళడానికి అతను అడ్డుగా ఉన్నాడు. అడ్డుగా ఉండటమే కాదు వెళ్ళవద్దు నేను రాలేను నిన్ను వదిలి ఉండలేను అని చెప్పాడు. అతను ఎంత బ్రతిమిలాడినా సరే ఈమె మాత్రం వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తుంది. అయితే ఆమెకు అతను చాలా ఇబ్బందిగా మారాడు. దీనితో అతన్ని చంపేసి అమెరికా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంది సదరు అమ్మాయి. తన క్లాస్ మేట తో కలిసి అమెరికా వెళ్ళాలి అని భావించింది.

అదే వ్యక్తితో కలిసి ప్రేమించిన వాడిని చంపాలి అని ప్లాన్ చేసుకుంది. ఇందుకోసం పక్కా ప్లాన్ గీసి పార్క్ కి తీసుకుని వెళ్ళింది. పుచ్చకాయలో విషం పెట్టి చంపేసింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో విషం కారణంగా మరణించాడు అని తెలిసింది. నాకు ఏమీ తెలియనట్లు ఆమె ఉంది. గత ఏడాది నవంబర్ లో జరిగింది ఈ ఘటన. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు సీసీ ఫూటేజ్ పరిశీలించి ఆమె పుచ్చకాయలో ఏదో కలిపినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఆమెకు సహకరించిన వారిని కూడా అరెస్ట్ చేసారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: