మనుషులు మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు. సాటి మనుషులకు ఏదైనా ప్రమాదం జరిగితే క్షణం కూడా ఆలోచించకుండా మానవత్వంతో సహాయం చేస్తూ ఉంటారు అని అంటారు.  ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు మాత్రం మనుషులు మానవత్వానికి కాదు క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఎంతలా అంటే అడవిలో జంతువులను వేటాడే సింహాలు అయినా కొన్ని కొన్ని సార్లు మానవత్వాన్ని చూపిస్తాయేమో కానీ అటు మనుషులు మాత్రం మానవత్వం అనే పదాన్ని మరచిపోయారు.



 ఇతర జంతువులను వేటాడే పులులు సింహాలు సొంత పిల్లల విషయానికి వస్తే అస్సలు ఊరుకోవు. కానీ మనుషులు మాత్రం సొంత పిల్లల ప్రాణాలు తీస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్య సమాజంలో బ్రతుకుతున్న మనుషులకంటే అడవుల్లో బ్రతికే మృగాలే బెటర్ అనుకునే విధంగా మారిపోయింది పరిస్థితి.  సాధారణంగా చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ఆడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అంతే కాదు ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుని ఎత్తుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మహిళకు మాత్రం చిన్నారురిని చూస్తే ప్రాణాలు తీయాలి అనిపించింది.


 కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో కక్షపూరితంగా ఏకంగా మనవడిని సొంత అమ్మమ్మ దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. కోయంబత్తూర్ కు చెందిన నాగలక్ష్మి కూతురు నందిని ఇటీవలే ప్రేమ వివాహం చేసుకుంది   ఇటీవలే భర్తతో విభేదాలు ఏర్పడటంతో తొమ్మిది నెలల చిన్న కుమారుడు దుర్గేష్ ని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇష్టం లేని ప్రేమ వివాహం కూతురు చేసుకోవడంతో మనవడి పై కోపంతో రగిలిపోయిన అమ్మమ్మ అభం శుభం తెలియని చిన్నారిని చంపేందుకు ప్లాన్ చేసింది. ఇక నోట్లో బిస్కెట్ ప్యాకెట్ కవర్ కుక్కి దారుణంగా హత్య చేసింది.  ఏమీ తెలియనట్లుగా ఉయ్యాలలో పడుకోబెట్టి నాటకానికి తెర లేపింది ఇక పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: