వరసకు బావ మరదలు కావడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అంతలోనే విధి విక్రయించి పెళ్లి చేసుకున్న పెళ్లయిన 38 రోజులకే ఆ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడిమకు చెందిన పుష్ప, ఆదూరి సాల్మన్‌రాజు దంపతులకు కొడుకు సన్ని(21) బీటెక్ పూర్తి చేసిన సన్ని మధిరలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

సన్నీ తన మేనత్త కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కల్యాణ లక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకునే పనిమీద భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్ళాడు. సన్నీ కొంతసేపటికి పని ఉందని, మళ్లీ వస్తానని చెప్పి బయటకు వచ్చాడు. ఇక బయటికి వెళ్లి చాల సమయం అయినా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన సన్ని భార్య మౌనిక, అత్త అన్ని చోట్లా వెతికారు. కానీ ఎక్కడ సన్నీ ఆచూకీ లభ్యం కాలేదు.

ఈ నేపథ్యంలో సన్ని పనిచేస్తున్న కంపెనీలో వేధింపులు ఎక్కువయ్యాయని, అందుకే బతకలేక చనిపోతున్నానని, ఆ కంపెనీ మేనేజ్‌మెంట్‌ను వదలొద్దని తన బావకు సందేశం పంపించాడు. అంతేకాదు.. తన భార్యను బాగా చూసుకోవాలని సన్ని పంపిన మెసేజ్ చూసి రైలు పట్టాలపై ఉన్నట్లు గుర్తించి హుటాహుటిన అక్కడకు వెళ్లగా అప్పటికే సన్ని మృతి చెందాడు. ఈ ఘటనపై జీఆర్పీ ఎస్‌ఐ రవికుమార్ కేసు నమోదు చేశారు.

ఇక సన్ని మృతదేహానికి ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో  పోస్ట్‌ మార్టం నిర్వహించి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఇక  పెళ్లయిన 38 రోజులకే సన్నీ ఇలా ప్రాణాలు తీసుకోవడంతో అతని భార్య మౌనిక రోదన అక్కడి వారిని కంటతడి పెట్టిస్తుంది. అంతేకాదు.. తనకు దిక్కెవరంటూ ఏడుస్తున్న ఆమెను చూసి స్థానికులకు కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: