ఈ దారుణమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. కేవలం 100 రూపాయల కోసం స్నేహితుడిని దారుణంగా తన  కత్తితో తన స్నేహితుడి  గుండెల్ని చీల్చి చంపిన ఘటన బుధవారం  చోటుచేసుకుంది. కూలి పనులకోసం మధ్యప్రదేశ్ నుండి ఇరవై మంది వలస కార్మికులు ఖమ్మం జిల్లా రఘునాధ పాలెం మండలం లోని ఎన్వీ బంజారా గ్రామానికి రెండు నెలల క్రితం వచ్చారు. వారంతా ఊరు సమీపం లో గుడిసెలు వేసుకొని కూలిపనులు చేసుకుంటున్నారు. ఆ వలస కూలీలలో సేతు పతి మరియు దయాల్ అనే ఇద్దరూ స్నేహితులు ఉన్నారు. 


స్వతహాగా వీరికి తాగే అలవాటుంది. బుధవారం రోజున ఓ రైతు వద్దకెళ్లి పని చేసినప్పుడు ఆ రైతు వారికీ కూలి డబ్బులు ఇచ్చి పంపాడు. అయితే డబ్బులు పంచుకునే క్రమంలో వారి మధ్య గొడవ తలెత్తినది. ఆ తరువాత దయాళ్‌, సేత్‌రాంల  మధ్య గొడవ పెద్దదైంది. మత్తులో ఉన్న ఇద్దరూ స్నేహితులు చాలాసేపు గొడవ పడ్డారు . అనంతరం కోపంతో ఇద్దరూ ఒకరిపైకి ఒకరు దడి చేసుకున్నారు. ఈ దాడిలో సేతురాం , దయాల్ ను కత్తితో దుండెలపై బలంగా పొడిచాడు. తీవ్ర రక్త స్రావం జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అయితే మిగతా కూలీలు దయాల్ ను జిల్లా ప్రధాన హాస్పిటల్ లో చేర్పించారు కానీ అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.



 స్థానికు ఈ విషయాన్నీ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రిలో ఉంచారు , నిందితుడు సేతురాం ను పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇలాంటి ఘటనలు మల్లి జరగకుండా చూడాలని గ్రామస్తులు పోలీసులకు విన్నవించుకున్నారు. పోలీసులు వారి సొంత ఊరికి సంబందించిన వివరాలను తెలుసుకుంటున్నారు. గొడవ పడ్డ వ్యక్తులకు గతం లో ఏమైనా ఇలాంటి హత్యల్లో సంబంధముందా అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు. ఆలా ఏమైనా క్రిమినల్ బ్యాగ్రౌండ్  ఉంటె వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు .


మరింత సమాచారం తెలుసుకోండి: