దేశ రాజధాని లో ఓ యువతిని అతి దారుణంగా పొడిచి చంపిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన అందరిని షాక్ కి గురిచేసింది. ఆమెను ఇద్దరు యువకులు అతి కిరాతకంగా కత్తి తో పొడిచి చంపారు. అయితే ఈ హత్యకు కారణం ప్రేమ వ్యవహారమే అని అంటున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో జరిగింది . కత్తి తో పొడవబడ్డ ఆ యువతీ బిందాపూర్ కి చెందిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్య వెనుకాల గల కారణాలను పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. పొలిసు వారి కధనం ప్రకారం కొంత కాలం గా ఆ యువతాయని ప్రేమించమని ఓ యువకుడు వెంటపడేవాడని ఆమె అతనిని నిరాకరించడం తో కక్ష పెంచుకుని ఇలా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. 

మంగళవారం అర్ధరాత్రి 1:40  నిమిషాల ప్రాంతం లో ఇద్దరు యువకులు చూస్తుండగా మరో ఇద్దరు యువకులు ఆమెను కత్తితో అతి దారుణంగా పొడిచి చంపారు. ఈ హత్యకు సంబందించిన దృశ్యాలు ఆ పక్కనే ఉన్నా సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయి. దింతో పోలీసులు ఆ వీడియోను ఆధారంగా చేసుకుని విచారణ మొదలు పెట్టారు. అయితే దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో లో  నలుగురు యువకులు కనిపిస్తున్నారు. అందులో ఓ యువకుడు హఠాత్తుగా వచ్చి ఆమె పై దాడి చేయడం కనిపిస్తుంది.ఆమెను కొంత దూరం జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళి   దాడి చేయడం గమనించవచ్చు. అందులో ఒక యువకుడు ఆ దాడిని ఆపే ప్రయత్నం చేసాడు . కానీ హంతకుడు ఆమె పై క్రూరంగా దాడి చేసాడు . ఆ దాడిలో ఆ యువతీ తీవ్రంగా గాయపడింది. ఆమె గాయపడినప్పటికీ లేచి హాస్పిటల్ కి వెళ్లేందుకు  సిద్దమయ్యింది.




 కానీ తీవ్రంగా కత్తి గాయాల పాలవ్వడంతో ఆమె ను హాస్పిటల్ కి తీసుకువెళ్లినా లాభం లేకపోయింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలను వదిలింది.  ఆ యువతి మాజీ ప్రియుడు అంకిత్ ఆమెను అతి కిరాతకంగా పొడిచి చంపాడు. ఆపై అక్కడనుండి పారిపోయాడు. అయితే పోలీసువారి కధనం ప్రకారం ఆ యువతీ అర్ధరాత్రి సమయంలో తన స్నేహితురాలిని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. తన ఇంటి నుండి బయలుదేరిన కాసేపటికే ఆమె హత్యకు గురయ్యింది. చనిపోయిన మృతురాలిని  డాలి బబ్బర్ గా పోలీసులు గుర్తించారు. దాడిలో ప్రత్యేక్షంగా కనిపించిన ముగ్గురు హిమాంశు , మనీష్ , అంకిత్ ల హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు . కేసుపై విచారణ కొనసాగుతోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: