ప్రతి విద్యార్థికి కూడా ఉపాధ్యాయుడే అసలు సిసలైన మార్గదర్శకుడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే చిన్న వయసు నుంచే ప్రతి ఒక్క చిన్నారి స్కూల్ కు వెళ్ళడం చేస్తూ ఉంటారు. ఇక ఆ చిన్నారుల్లో ఉన్నత విలువలను పెంపొందించడంలో ఉన్నతంగా ఆలోచించేలా చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. అంతే కాదు విద్యార్థులను సన్మార్గంలో ఉపాధ్యాయులు నడిపించాల్సి ఉంటుంది. అందుకే నేటి సమాజంలో ఎవరికీ లేనంత విలువ భావి భారత తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ఉంటుంది అని చెప్పాలి. కానీ ఇటీవలే ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతూ ఉపాధ్యాయులు చేస్తున్న పని మాత్రం ఆ పదవికి కళంకం తెచ్చే విధంగా ఉన్నాయి.


 సొంత బిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థులపై ఎంతో మంది ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో బడికి వెళ్లాలంటే ఆడపిల్లలు భయ పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక మరి కొంత మంది ఉపాధ్యాయులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇక ఇటీవలే గుంటూరు జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించాడు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థులను  పెడదోవ పట్టించే ప్రయత్నం చేశారు.



 గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాలివాహన నగర్ లోని ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఇలా కీచకుడిగా మారిపోయాడు. ఇక ఈ విషయం తల్లిదండ్రుల వరకు వెళ్లడంతో చివరికి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హుస్సేన్ అనే ఉపాధ్యాయుడు  బ్లూఫిలిమ్స్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. 4, 5 వ తరగతి విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలి అంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: