మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలు చూశాము. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ముగ్గురు స్నేహితులు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం గా మారిపోయింది. ముగ్గురు చిన్నప్పుడు నుంచి ఎంతో మంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. కానీ ఏమైందో తెలియదు ఇటీవలే ఒక్కసారిగా చెరువులో ముగ్గురు విగత జీవులుగా మారిపోయారు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. జగిత్యాల శివారులో ఉన్న ఉప్పరి పేట కు చెందిన గంగాజల,మల్లిక, వందన చిన్నప్పటినుంచి స్నేహితులు.



 వీరు బంధువులు కూడా కావడం గమనార్హం. కాగా గంగాజల, మల్లికకు ఈ ఏడాది ఆగస్టులో వివాహం జరిగింది. కాగా వందన ప్రస్తుతం ఇంటర్ చదువుతుంది.ఇక ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవారు.  అయితే ఇటీవల అనారోగ్యం బారినపడిన మల్లికా పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే మరో స్నేహితురాలు గంగాజల కూడా ఏదో కారణం చెప్పి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు స్నేహితురాళ్లు కలిసి షాపింగ్ వెళుతున్నాము అంటూ ఇంట్లో చెప్పి వెళ్లారు. అయితే రాత్రి అయినప్పటికీ ఇంటికి మాత్రం తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులుకంగారుపడి చుట్టుపక్కలా గాలించారు. ఎంతకి ఆచూకీ మాత్రం తెలియలేదు.


 ఈ క్రమంలోనే ఈ మూడు కుటుంబాలలో కూడా ఎంతగానో ఆందోళన పెరిగి పోయింది. ఇక చేసేదేమిలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. తరువాత ఏకంగా ధర్మ సముద్రం చెరువు లో రెండు మృతదేహాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే పోలీసులు వారి కుటుంబీకులకు కూడా సమాచారం అందించగా.. అక్కడికి వెళ్లి చూసి ఆ మృతదేహాలు గంగాజల, మల్లికవే అన్నవి గుర్తించారు కుటుంబ సభ్యులు. ఇక అంతలోనే మరో రెండు గంటల తర్వాత వందన మృతదేహం కూడా అదే చెరువులో లభ్యం కావడం గమనార్హం. దీంతో ఏం జరిగి ఉంటుంది అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ముగ్గురూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఇంకేదైనా జరిగి ఉంటుందా అనే దానిపై మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: