నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అటు మనుషుల్లో మానవత్వం అనేది అసలు బ్రతికి ఉందా అని అనుమానం కలుగక మానదు. రోజు రోజుకి మనిషి మానవ మృగం గా మారిపోతు ఉన్నాడు. దీంతో  జాలి దయ అన్న విషయాన్ని మరిచిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. నేటి రోజుల్లో మనుషుల ప్రవర్తన చూస్తుంటే అడవిలో బ్రతికే క్రూరమృగాలు అయినా కాస్త బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. అంత దారుణంగా మనిషి ప్రవర్తన తీరు మారిపోతుంది.. ముఖ్యంగా ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తున్న కామంధులు రోజూ రేచ్చిపోతూనే వున్నారు. మహిళలపై అత్యాచారం చేస్తున్న వారికి ఉరిశిక్షలు విధిస్తు ఉన్నప్పటికీ పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపుతున్నప్పటికీ  కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు.



ఇలా ఇటీవలి కాలంలో రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే మొన్నటి వరకు కేవలం ఒంటరిగా ఉన్న మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారు కామందులు. కానీ ఇటీవల కాలంలో ఆడపిల్లల పక్కన కుటుంబీకులు ఉన్నప్పటికీ వారిపై దాడి చేసి మరీ అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఇక ఆడపిల్ల రక్షణ ఎక్కడ ఉంది అని సభ్య సమాజమే తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు దుండగులు ఓ మహిళపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. సురేష్, శ్రీకాంత్ అనే ఇద్దరు దుండగులు  ఒక వ్యక్తికి పీకలదాకా మద్యం తాగించారు..
 ఇక ఆ వ్యక్తి మద్యం సేవించి మత్తు లోకి వెళ్ళగానే అతడి భార్య పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దారుణంగా హత్య చేశారు. అయితే ఇక ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సురేష్ ను అదుపులోకి తీసుకోగా ప్రస్తుతం శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: