డ‌బ్బు అంటే ఎవ‌రికి ఆశ ఉండ‌దు.. ఆశకుపోయి చాలామంది చాలా సార్లు మోస‌పోయిన ఘ‌ట‌న‌లు కూడా చాలానే ఉన్నాయి.  తాజాగా.. అధికవడ్డి  ఆశకు పోయిన టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను మోసం చేసిన మ‌హిళ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. మోస‌పోయిన వారిలో ముగ్గురు హీరోల‌తో పాటు ప్ర‌ముఖులు కూడా ఉండ‌డం గ‌మానార్హం. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. శిల్పా అనే మ‌హిళా వ్యాపార‌వేత్త అధిక వ‌డ్డీ పేరుతో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ల కు గాలం వేసింది. మ‌హిళ‌ను గుడ్డిగా న‌మ్మిన వాళ్లు ఆమెకు డబ్బులు ఇచ్చారు.  


త‌రువాత తాము మోసపోయామ‌ని గుర్తించి.. ల‌భో దిబో మంటున్నారు. బాధితుల్లో బ‌డా హిరోలు ఉన్నారంటేనే ఆ మ‌హిళ ఎంత కిలేడీ నో అర్థం చేసుకోవచ్చు.  ముగ్గురు  టాలీవుడ్ హీరోల ను  శిల్ప మోసం చేసింది. ప్రముఖుల పేర్లు చెప్పి డబ్బులను తీసుకుని.. ఫేజ్ త్రీ పార్టీ లు ఇచ్చి  సెలబ్రిటీలను  ఆకర్షించింది. సుమారు 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు కుచ్చు టోపీ  పెంది ఆ మ‌హిళ‌. దీంతో బాధితులు తాజాగా ఈ కిలేడీపై నార్సింగి పోలిస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేయ‌డంతో.. ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శిల్ప‌తో పాటు ఆమె భ‌ర్త‌ను కూడా అరెస్ట్ చేశారు.


దీంతో పాటు చాలా మంది ప్ర‌ముఖులు తాము మోసపోయామని అంటూ పోలీస్ స్టేషన్ లకు  క్యూ కడుతున్నారు.  చాలామంది ప్రముఖుల్ని శిల్పా మోసం చేసినట్టు  పోలీసుల ప్రాథ‌మిక‌ విచార‌ణ‌లో తేలింది. శిల్ప బారిన పడిన వారిలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ,లాయర్లు ఫైనాన్సు కూడా ఉన్నారు. అలాగే శిల్ప‌కు ప‌లు చీటింగ్ కేసుల్లో ప్ర‌మేయం ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ మ‌హిళ బాధితుల్లో సినిమా ప్ర‌ముఖులే కాకుండా బ్యూరోక్రాట్ల తో పాటు ఉన్న‌త స్థాయి వ్య‌క్తులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి విష‌యాల‌పై పోలీసులు ఎన్ని అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న ప్ర‌జ‌లు మోస‌పోతూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: