నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలో చూస్తుంటే ఈ సమాజం తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. నేటి సమాజంలో బ్రతుకుతుంది మానవత్వం ఉన్న మనిషుల లేకపోతే మనిషి రూపంలో ఉన్న మానవ మృగాలా అన్నది మాత్రం అర్థం కాని విధంగా మారిపోయింది. దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.  ఆడపిల్లల జీవితం రోజురోజుకీ ప్రశ్నార్థకంగా మారిపోతోంది అనే విషయం తెలిసిందే. ఈ భూమి మీద ఆడపిల్లగా పుట్టడమే మేము చేసిన పాపమా అని ప్రతి ఆడపిల్ల బాధ పడే విధంగా నేటి రోజుల్లో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆడపిల్లలపై తరచూ వెలుగులోకి వస్తున్న అత్యాచార ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.



 కామాంధులను శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడ ఎవరీలో మార్పు మాత్రం కనిపించడం లేదు. ఆడపిల్ల గడప దాటి కాలు బయట పెట్టడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. అయితే మొన్నటి వరకూ కేవలం బయట తిరిగే ఆకతాయిల నుంచి మాత్రమే మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొనే వారు. కానీ ఇటీవల కాలంలో ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన వారు సైతం లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుంగిపోతూ ఎంతోమంది ఆడపిల్లలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. సమస్య వచ్చినప్పుడు అండగా ఉంటారు అనుకున్నా సొంత తండ్రి అన్న లాంటి వాళ్లేబంధాలు బంధుత్వాలు మరిచి రక్తసంబంధం సైతం కాలరాస్తూ ఏకంగా కాలనాగులు గా మారిపోతున్నారు.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. తోడబుట్టిన చెల్లికి రక్షణ కల్పించాల్సిన అన్నా చివరికి కాలనాగుల మారిపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో చివరికి బాధితురాలు గర్భందాల్చిన ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు లో వెలుగులోకి వచ్చింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో 16 ఏళ్ల బాలిక అన్న వినయ్ కుమార్ వద్ద ఉంటుంది. అయితే సదరు 16 ఏళ్ల బాలిక కు ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కలు ఉండగా అక్కలకు పెళ్లి కావడంతో అన్న వినయ్ కుమార్ వద్ద ఉంటుంది బాలిక. ఈ క్రమంలోనే మద్యానికి బానిసగా మారిన వినయ్ కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇలా కొన్ని నెలల నుంచి జరగడంతో చివరికి బాలిక గర్భవతి అయింది. విషయం తెలిసిన మరో అన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: