నేటి రోజులలో జనాలు ఆస్తులు అంతస్తులు విలువ ఇస్తున్నారు తప్ప మనుషులకు బంధాలకు బంధుత్వాలకు మాత్రం అసలు విలువ ఇవ్వడం లేదు అని చెప్పాలి. ఆస్తుల కోసం ఏకంగా సొంత వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన వారిని సైతం దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది ఇక్కడ. ఏకంగా భర్త చనిపోయి  పిల్లలతో కలిసి ఉంటున్న మహిళను ముగ్గురు వ్యక్తులు దారుణంగా కాల్చి చంపడం సంచలనంగా మారిపోయింది. పుష్ప యాదవ్ అనే మహిళ భర్తతో కలిసి  థాయిలాండ్ లో ఉండేది. ఇటీవల భర్త అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందాడు.



 అయితే భర్త చనిపోవడంతో తన స్వగ్రామమైన గోకర్ పూర్ జిల్లా సిదావు పార్ గ్రామానికి వచ్చి నలుగురు పిల్లలతో కలిసి ఉంటుంది.  ఇటీవలే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు అలా బైక్ వచ్చి ఆగింది..  ఈ క్రమంలోనే పుష్ప యాదవ్ ఇంటికి గేట్ వద్దకి వచ్చిన ఓ వ్యక్తి నేను   మాస్క్ పెట్టుకోవటం వల్ల గుర్తు పట్టలేదని గేట్ తీయాలంటూ కోరాడు. ఇలా పుష్ప యాదవ్ గేట్ తీయగానే ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఇక పుష్ప యాదవ్ చేతుల్లో కొన్ని రకాల పండ్లను పెట్టాడు. ఇక ఏం జరుగుతుందో పుష్ప యాదవ్ అర్థం కాలేదు. ఇంతలో పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చారు. తుపాకీ శబ్దం విన్న కూతురు ఇంట్లో నుంచి బయటకు రావడంతో చివరికి అక్కడి నుంచి పారిపోయారు.  నిందితుల పుష్ప యాదవ్ కి తలలోంచి  బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఆస్తి తగాదాల కారణంగా నే హత్య జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: