ఇటీవలే మద్యం మత్తు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువైపోయింది. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది..మద్యం మత్తు రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కొడుకు మారాం చేస్తున్నాడు అని ఏకంగా బైక్ ఇప్పించాడు తండ్రి. కానీ ఆ బైక్ ఆ కొడుకు ప్రాణం తీస్తుంది అని మాత్రం ఊహించలేకపోయాడు. ఇటీవల ఇద్దరు స్నేహితులు కలిసి మద్యం మత్తులో ద్విచక్రవాహనంపై చక్కర్లు కొడుతున్న సమయంలో ప్రమాదం జరిగింది.. దీనితో అక్కడికక్కడే చనిపోగా మరొకరు మృత్యువుతో పోరాడి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
హైదరాబాద్ నగరంలోని సూరారం లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. అబ్బాస్ అనే 20 ఏళ్ల యువకుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాడు. ద్విచక్ర వాహనం కావాలంటు కొన్ని నెలల నుంచి తల్లిదండ్రులు తరచూ అడిగే వాడు. కొడుకుకోసం ఇటీవల తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ద్విచక్ర వాహనం కొనీచ్చారు. ఈనెల 25వ తేదీన స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉన్న సమయంలో చివరికి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీ కి చెందిన సాయి కిరణ్ తీవ్రగాయాలు అవగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అబ్బాస్ అక్కడికక్కడే మృతిచెందాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.