ప్రేమ విఫలం అవుతుందేమో అన్న బాధతో ఎన్నో ప్రేమజంటలు మనస్తాపంతో ఏకంగా ఆత్మహత్యకు పాల్పడుతూ కుటుంబాలను విషాదంలోకి నెడుతున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ప్రేమజంట ఏకంగా కెఎస్ఆర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మైసూరు నగరంలోని మేటేగా లేఅవుట్లో నివాసముంటున్న నవీన్, నిసర్గ అనే ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు. ఇద్దరు కూడా బంధువులే కావడం గమనార్హం. ఇక ప్రేమ విషయం పెద్దలకు తెలియకుండా గుట్టుగానే ఉన్నారు.
అయితే ప్రేమ విషయం పెద్దలకు చెప్పేందుకు ధైర్యం సరిపోలేదు. ఇదిలాఉంటే ఇటీవలే సమీప గ్రామానికి చెందిన యువకుడితో ఆ యువతికి వివాహం నిశ్చయమైంది. పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. అయితే ప్రియుడిని మాత్రం మర్చిపోలేక పోయింది నిసర్గ. ఈ క్రమంలోనే ఇటీవల ఇంటి నుంచి బయటకు వెళ్ళి ప్రియుడిని కలిసింది.. ఇద్దరు కలిసి కేఆర్ఎస్ కాలువ వద్దకు వెళ్లారు. ఇక నిసర్గ తన చున్నీతో ప్రియుడిని నడుముకు కట్టుకుంది ఇద్దరు కలిసి కాలువలో దూకారు. అయితే రెండు రోజులుగా బైక్ అక్కడే ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇక కాలువలో గాలించగా ఇద్దరి మృతదేహాలు కూడా బయట పడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.