ఇటీవలి కాలంలో మానవ బంధాలు బంధుత్వాలకు మనుషులు ఎక్కడ విలువ ఇవ్వడం లేదు. వావి వరసలు మరిచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా క్షణకాల సుఖం కోసం మనిషి చేస్తున్న నీచమైన పనులు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మానవ బంధాలను మరిచి  చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి సంచలనం గా మారిపోయింది. ఏకంగా తల్లి తర్వాత తల్లి లాంటి అత్తతో అక్రమ సంబంధానికి తెరలేపాడు. అంతేకాదు ఈ అక్రమ సంబంధం దారుణానికి దారితీసింది. హర్యానాలో రెండు నెలల కిందట జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..


 మృతుడి భార్య మేనల్లుడు తో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. హత్యకు కారణం అత్తా అల్లుళ్ళ మధ్య ఉన్న అక్రమ సంబంధమే అన్నది పోలీసులు నిర్ధారించారు.. పాల్వాల్ లోని హోడల్ ప్రాంతంలో నివసించే మహేష్ తన తమ్ముడు తారాచంద్ కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ప్రాంతంలో తారాచంద్ కనిపించగా దగ్గరికి వెళ్లి చూస్తే పూర్తిగా గాయాలతో రక్తమయం అయి ఉన్నాడు. అన్న మహేష్ తారాచంద్ ను ఆసుపత్రికి తరలించగానే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.


 ఈ క్రమంలోనే మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తమ్ముడి ని ఎవరో తుపాకీతో కాల్చి చంపారు అంటూ ఫిర్యాదు చేయగా ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.. ఈ క్రమంలోనే తన మేనల్లుడు కృష్ణ కుమార్ తారాచంద్  భార్య పై కూడా మహేష్ అనుమానం వ్యక్తం చేయగా.. వారిద్దరిని పిలిచి పోలీసులు విచారించారు. అయితే మేనల్లుడు తో అక్రమ సంబంధం ఉంది అన్న విషయాన్ని తారాచంద్ భార్య పోలీసు విచారణలో ఒప్పుకుంది. తమ సంబంధం  గురించి భర్తకు తెలియడంతోనే  నాటు తుపాకీతో కాల్చి  చంపాము అంటూ ఇక నిందితులు ఇద్దరు కూడా పోలీసు విచారణలో ఒప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: