ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత భార్యకు తోడునీడగా ఉండాలి భర్త. ఎలాంటి సమస్య వచ్చినా రక్షణ కవచంలా నిలబడాలి. భార్య మనసును అర్థం చేసుకుని ఎంతో సంతోషంగా చూసుకోవాలి. కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం కట్టుకున్న బంధానికి అస్సలు విలువ ఇవ్వలేదు. సాధారణంగా కట్టుకున్న భార్య వైపు ఎవరైనా చూస్తేనే సహించరు భర్తలు. కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం ఏకంగా కట్టుకున్న భార్యను స్నేహితుల పక్కలోకి పంపించాడు. భార్యకు మత్తు మందు ఇచ్చి స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని ఇటీవ్వా జిల్లాలో వెలుగులోకి వచ్చింది.


 కొత్తగా పెళ్లయిన మహిళలకు మత్తు మందు ఇచ్చి ఏకంగా కట్టుకున్న భర్త స్నేహితులతో అత్యాచారం చేయించడం స్థానికంగా అందరినీ షాక్కు గురి చేసింది.ఇటీవలే పెళ్లి చేసుకున్న యువతి కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. కానీ అత్తారింటి అసలు రంగు మాత్రం ఊహించలేకపోయింది. ఏకంగా ఇంట్లోనే భర్త అతని స్నేహితులు కలిసి యువతిపై అత్యాచారం చేయడంతో పాటు తీవ్రంగా గాయపరిచారు. ఇక ఆ తర్వాత బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి నిందితులు తప్పించుకున్నారు. చికిత్స పొందుతున్న ఆ బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


 ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు వాస్తవాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు.. ఏకంగా మొదటి రాత్రి రోజు ఇంతటి దారుణం జరగడంతో ఆ యువతి నిర్ఘాంత పోయింది అనే చెప్పాలి.. మద్యం మత్తులో  తన భర్త, అతని స్నేహితులు కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించారని వారి నివారించేందుకు ప్రయత్నించగా తనపై దాడి కూడా చేశారు అంటూ ఆ యువతి చెప్పింది. ఈక్రమంలోనే తనకి అలసటగా ఉండడంతో తన భర్త ఒక టాబ్లెట్ ఇచ్చాడని అది మత్తు టాబ్లెట్ అని నాకు తెలియదు అంటూ బాధితురాలు తెలిపింది. కాగా ప్రస్తుతం ఇప్పుడిప్పుడే  యువతి ఆరోగ్యం కోలుకుంటుందని అటు వైద్యులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: