దేశం మొత్తం టెక్నలజీ వెంట పరుగులు పెడుతోంది. ప్రతి ఒక్క మనిషి నాగరిక సమాజంలో అడుగుపెడుతున్నాడు. దీంతో మనిషి జీవన శైలిలో మార్పులు వచ్చాయి.  ఒకప్పటి మూఢనమ్మకాలను మనిషి ఎప్పుడూ వదిలేశారడు. అదే సమయంలో ప్రతి ఒక మహిళ కూడా మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంకా కొన్ని ప్రాంతాలలో బాల్యవివాహాలు ఎంతో మంది బాలికల జీవితాలను నాశనం చేస్తూనే ఉన్నాయి. పురుషులతో పాటు సమానంగా చదువుల్లో వ్యాపారాల్లో మహిళలు దూసుకుపోతుంటే మరోవైపు ఎంతో మంది మహిళలు బాల్యవివాహాల ద్వారా చిన్న వయసులోనే నరకాన్ని అనుభవిస్తున్నారు.


 అయితే ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ బాల్యవివాహాలను చేస్తూ ఉండటం గమనార్హం. బాల్య వివాహాలు చట్టప్రకారం  నేరం అంటూ పోలీసులు ఎన్నో పెళ్లిళ్లను ఆపేస్తున్నప్పటికీ అటు ఎవరికీ తెలియకుండా గుట్టుగా జరుగుతున్న బాల్య వివాహాలు రోజురోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి. తల్లిదండ్రులకు ఎదురు చెప్పే ధైర్యం లేక ఎంతో మంది బాలికలు ఇక ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక బాలిక మాత్రం జీవితం నాశనం కాకుండా తానే అడ్డుకుంది.



 ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా తన జీవితం కోసం తానే ధైర్యం చేసింది సదరు బాలిక. చిన్న వయసులో జరుగుతున్న తన పెళ్లిని ఆపుకుంది. రాజస్థాన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. చిత్తూర్ ఘడ్  కు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలిక పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. వద్దు అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు. డిసెంబర్ 11వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. అయితే తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినక పోవడంతో చివరికి బాలిక ఎంతో ధైర్యం చేసి బాలల హక్కుల పరిరక్షణ సమితిని సంప్రదించింది. హెల్ప్ లైన్  నెంబర్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆ బాలిక వివాహం ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: