ఇటీవల కాలంలో ఎంతోమంది పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పిల్లి, కుక్క లాంటి జంతువులను ఇంట్లో పెంచుకుంటూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో అయితే జంతు ప్రేమికులు మనుషుల కంటే ఎక్కువగా జంతువులే పైన ప్రేమ చూపిస్తూ ఉండటం గమనార్హం. మరి కొంతమంది ఏకంగా జంతువులను కూడా ఇంట్లో మనిషిగా భావిస్తూ ఇప్పుడు జంతువులకు బారసాల నిర్వహించడం శ్రీమంతాలు చేయడం లాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.


 ఇలా మనుషుల్లో మనుషుల మీద ప్రేమ కంటే పెంపుడు జంతువుల మీద ప్రేమ రోజురోజుకు ఎక్కువైపోతుంది అనడానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇక్కడ పెంపుడు జంతువు మీద ఒక వ్యక్తికి ఉన్న ప్రేమ ఏకంగా అతన్ని జైలుపాలు చేసింది. అది కూడా జీవిత ఖైదు శిక్ష పడే విధంగా చేసింది. పెంపుడు జంతువు మీద ఉన్న ప్రేమ  ఉన్న ప్రేమ అతనిలో ఉన్న మానవత్వాన్ని మసకబారేలా చేసింది. దీంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క కోసం ఏకంగా ఒక హత్య చేశాడు సదరు వ్యక్తి.


 ఇది వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇది నిజంగానే జరిగింది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ప్రశాంత్ అనే వ్యక్తి ఒక కుక్కపిల్లని పెంచుకుంటున్నాడు. ఆ కుక్క పిల్ల పొరుగింట్లో ఉంటున్న శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లింది. దీంతో శ్రీనివాస్ కోపంతో ఆ కుక్కను కొట్టాడు. అయితే ప్రేమగా పెంచుకున్న కుక్కను కొట్టడంతో ప్రశాంత్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన స్నేహితుల సహాయంతో శ్రీనివాసును దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత భార్య రేణుక ను కూడా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. 2014లో ఈ ఘటన జరిగింది. కోర్టులో దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుండగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నా ప్రశాంత్ కు సహాయం చేసిన అతని ఇద్దరు స్నేహితులు కూడా కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతే కాదు ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: