నేటి రోజుల్లో టెక్నాలజీ అంతకంతకు పెరిగిపోతోంది
 మనిషి జీవన శైలిలో మార్పులు వస్తున్నాయి. ఇలా వస్తున్న మార్పులు ఎంతో మంచిది అని చెప్పాలి. కానీ మనుషుల్లో రోజు రోజుకి మానవత్వం కనుమరుగు అవుతుండటం మాత్రంఎన్నో దారుణాలకు దారితీస్తోంది. ఇటీవలి కాలంలో చాక్లెట్ తిన్నంత ఈజీగా ఏకంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు ఎంతోమంది. ప్రాణాలు తీయడం విషయంలో కనీసం జాలి దయ అనేది కూడా చూపించడం లేదు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీస్తూ చివరికి జైలు పాలు అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 అయితే ఇటీవల ఇలాంటి తరహా ఘటన జరిగింది. అతని వయస్సు  19 ఏళ్లు. ఈ వయసులో ఎవరైనా ఏం చేస్తారు కాలేజీకి వెళ్లి బుద్ధిగా చదువుకుంటూ ఉంటారు. కానీ అతను మాత్రం జల్సాలకు అలవాటు పడ్డాడు. చివరికి డబ్బుల కోసం నేరాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. దొంగతనాలు చేయడం..  దొంగలించిన వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటూ జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. అయితే ఇక ఇలా జల్సాల కోసం ఏకంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయలేదు. ఇటీవలే నిజాంబాద్ లో నిద్రిస్తున్న ముగ్గురు తలపై సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం గా మారిపోయింది.


 ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఈ ఘటనలో నిందితుడు జల్సాలకు అలవాటు పడిన 19 ఏళ్ల యువకుడు అన్న విషయం బయటపడింది. ఇలా నిజాంబాద్ జిల్లా డిచ్పల్లి లో గత వారం జరిగిన ముగ్గురు దారుణ హత్య కేసులో 19 ఏళ్ల శ్రీకాంత్ ను అరెస్టు చేశారు పోలీసులు. అయితే హత్య చేసిన సమయంలో మూడు సెల్ఫోన్లు నగదు నగలు అన్ని తీసుకొని పారిపోయాడు. ఇటీవల దొంగలించిన సెల్ఫోన్లో తన సిమ్ కార్డు వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ట్రేస్ చేసిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: