ఇక ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ వివాహబంధంలో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నారు వారి వివాహ బంధం ఎంతో సంతోషంగా సాగిపోతుంది కానీ అంతలో వారి జీవితంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. సంతోషం గా ఉన్న భార్యాభర్తల ను చూసి విధి ఓర్వ లేక పోయిందో ఏమో చివరికి ఆ యువకుడు భార్యను తీసుకుని బయటకి సరదాగా వెళ్లిన సమయంలో ఊహించని రీతిలో ప్రాణం పోయింది. ఏకంగా గాలిపటానికి కట్టిన దారం చివరికి వారి ప్రాణం తీసింది. గాలిపటానికి కట్టిన సన్నటి దారమే నవదంపతుల పాలిట మృత్యువు పాశం అయిపోయింది ఈ విషాదకర ఘటన కటక్ లో వెలుగులోకి వచ్చింది.
జయంత్ అనే యువకుడుకి ఇటీవల పెళ్లి జరిగింది. భార్య భర్తలు ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము అనీ ఈ నవ దంపతులు ఎంతగానో సంతోషపడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల భార్యను తీసుకొని తన ద్విచక్రవాహనంపై సరదాగా బయటికి వెళ్లాడు జయంత్. కానీ తమ కోసం పతంగి దారం రూపంలో మృత్యువు ఎదురు చూస్తుంది అని మాత్రం గ్రహించలేకపోయాడు. జగత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కి రాగానే జయంత్ గొంతుకి గాలిపటానికి కట్టిన దారం తగిలింది.. అయితే దీంతో వెంటనే గొంతు తెగిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు చివరికి చికిత్స పొందుతూ మరణించాడు జయంత్. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే భర్త దూరం కావడంతో ఆ నవవధువు అరణ్యరోదనగా విలపిస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.