ఈ మధ్యకాలంలో మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగై పోతుంది. అడవుల్లో ఉండే క్రూరమృగాలు అయినా కాస్తయినా జాలి చూపిస్తాయేమో కానీ మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు మాత్రం నేటి రోజుల్లో జాలి దయ అనే వాటికి ఆమడ దూరంలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే చాక్లెట్ తిన్నంత  సులభంగా ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. ముఖ్యంగా సొంతంవారి ప్రాణాలు తోడేస్తూ ఉండడంతో ఇక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది నేటి రోజుల్లో.ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకుని అల్లారుముద్దుగా పెంచిన పేగు బంధాన్ని మరచిన తల్లిదండ్రులు కన్నకూతురిని దారుణంగా హతమార్చారు.



 ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది ఈ దారుణ ఘటన. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని హారదోయ్ లొ నరేంద్ర కమల అనే భార్య భర్తలు నివసిస్తున్నారు. వీరికి ఒక కూతురు పుట్టింది. చిన్నప్పటినుంచి ఎంతో అల్లారుముద్దుగా కూతురుకి ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. కూతురె ప్రపంచంగా బ్రతికే వారు ఆ తల్లిదండ్రులు. అయితే ఆమెకు 19 ఏళ్ళు వచ్చాయి  ఇక ఇటీవల ఆ యువతి ఓ యువకుడితో పదే పదే ఫోన్ మాట్లాడుతూ ఉండడాన్ని తల్లిదండ్రులు గమనించి తీరు మార్చుకోవాలి అడ్డుకుంటామని హెచ్చరించారు.


 అయినప్పటికీ ఆ యువతి మాత్రం తన ప్రియుడితో ఫోన్ మాట్లాడుతూనే ఉంది. దీంతో కూతురి వల్ల ఎక్కడ పరువు పోతుందోనని భయం వారిలో నిండిపోయింది. ఇక పరువు కంటే కూతురు ఏం ఎక్కువ కాదు లే అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కన్న పేగు బంధాన్ని మరిచి కూతురిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ ప్రకారం కూతురిని హత్య చేసి ఇక మృతదేహాన్ని పొలంలో పడేసారు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులను  అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే కూతురిపై ప్రియుడే అత్యాచారం చేసి హత్య చేశాడంటూ తల్లిదండ్రులు కొత్త నాటకానికి తెరలేపారు. ఇక అనుమానం వచ్చిన పోలీసులు తల్లిదండ్రులను తమదైన శైలిలో విచారించగా తను అసలు నిజం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: