భార్య భర్తల బంధం అన్న తర్వాత అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. కానీ నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఎక్కడా కనిపించడం లేదు.. మనసా వాచా కర్మణా మూడుముళ్ల బంధంతో ఒక్కటై కడవరకు కష్ట సుఖాల్లో తోడు ఉంటామని ప్రమాణం చేసిన వారే చివరికి కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. కొంతమంది అయితే రక్తం పంచుకుని పుట్టిన పిల్లల విషయంలో కూడా కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు. దీంతో ఎంతో మంది  ఏకంగా సొంత వారి ప్రాణాలను దారుణంగా తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు.


 తాను చేసిన తప్పుకు భార్యా పిల్లల  ప్రాణాలను బలి తీసుకున్నాడు. దారుణంగా భార్య పిల్లలను హత్య చేసాడు.. కారణం అతడు ఆన్లైన్ గేమ్ కి బానిసగా మారిపోవడమే. ఇటీవలి కాలంలో ఎంతోమంది ఆన్లైన్ గేమ్ లకి బానిసలుగా మారిపోయి.. ఇక భారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ మోసపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాదు ఇంకా ఎంతోమంది ఆన్లైన్ గేమ్స్ కి బానిసలుగా మారి పోతూ పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఆన్లైన్ గేమ్ కి బానిస గా మారిపోయిన ఒక వ్యక్తి అప్పులపాలై చివరికి భార్య పిల్లలను దారుణంగా హత్యచేశాడు. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది.


 పేరున్గుది పెరియార్ లోని ఓ అపార్ట్మెంట్లో మణికంఠన్, తార దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కోయంబత్తూర్ కు చెందిన మణికంఠన్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. కానీ రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెట్టి బానిసగా మారిపోయాడు. ఓ వైపు ఉద్యోగం మానేయడం మరోవైపు ఆన్లైన్లో డబ్బులు పెట్టి నష్టపోవడంతో అప్పుల పాలయ్యాడు. ఇక ఇదే విషయంపై తరచూ భార్య భర్తల మధ్య గొడవలు కూడా జరగడం మొదలయ్యాయి. ఇక ఇటీవల మరోసారి భార్యతో గొడవ పడ్డాడు మణికంఠన్. దీంతో కోపంతో ఊగిపోయిన అతను దారుణంగా భార్య పిల్లలను హత్య చేశాడు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు ఇంటి తలుపులు మూసి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: