ప్రతి మనిషి జీవితంలో ఎన్నో మధురానుభూతులను మిగిల్చే ప్రేమ నేటి రోజుల్లో అరణ్యరోదనకు కారణం అవుతుంది అన్నది తెలుస్తోంది.   ప్రేమించడం అంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే అన్నట్లుగా మారిపోయింది నేటి రోజుల్లో పరిస్థితి. ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే  ప్రేమ అనే పేరు పలకడానికి భయ పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రేమకు కులాన్ని అంటగట్టిన ఎంతోమంది దారుణంగా పరువు హత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో ప్రేమించిన వ్యక్తే ప్రేమ పేరుతో మోసం చేయడంతో చివరికి మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. మరోవైపు ప్రేమోన్మాదులు రెచ్చిపోయి దారుణంగా హత్య చేసిన ఘటనలు అందరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.


 ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా బ్రతకలేను ఇక జీవితాంతం నీతో బ్రతకాలి అనుకున్నాను అంటూ మాయ మాటలు చెబుతున్నా ఎంతోమంది ఆ తర్వాత ఉన్మాదులు గా మారిపోయి ప్రేమించిన యువతులపై దారుణంగా దాడులు చేస్తున్న ఘటనలు అందర్నీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడ ఓ యువకుడు నువ్వే ప్రపంచం అంటూ మాయమాటలు చెప్పాడు. ఎన్ని రోజుల పాటు ప్రేమను నటించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని నిలదీయడంతో అసలు స్వరూపం బయటపెట్టి నువ్వే ప్రాణం అంటూ ప్రేమించిన ప్రియురాలి ప్రాణాలను గాల్లో కలిపేశాడు.


 ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లో వెలుగులోకి వచ్చింది. అఖిల్ వరలక్ష్మి అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు. ఎన్నో రోజుల పాటు ప్రేమలో మునిగితేలారు. అయితే ఇటీవలే వరలక్ష్మి  కనిపించకుండాపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడు అఖిల్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో వరలక్ష్మీ హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: