రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో యువతి మృత దేహం కలకలం రేపుతోంది.  అత్తా పూర్ చింతల్ మెట్ ఓ అపార్ట్‌ మెంట్ లో గుర్తు తెలియని యువతి అనుమా నాస్పద స్థితి లో మృతి చెందింది.  ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని  కనిపించిన యువతి... యువతి మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.  ఈ విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరు కున్నారు రాజేంద్ర నగర్ పోలీసులు. పోలీసులతో పాటుగా రంగం లోకి దిగాయి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు.  అపార్ట్‌మెంట్ ఓ ప్లాట్ లో నుండి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి పోలీసుల కు సమాచారం ఇచ్చారు అపార్ట్‌మెంట్ వాసులు. దీంతో హుటా హుటిన అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నారు రాజేంద్రనగర్  పోలీసులు. ఫ్లాట్ తలుపులు బద్దలు గొట్టి లోపలికి వెళ్లారు రాజేంద్రనగర్  పోలీసులు.  అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహాన్ని గుర్తించారు రాజేంద్రనగర్ పోలీసులు. 

అదే గదిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నట్లు అనుమానం  వ్యక్తం చేస్తున్నారు రాజేం ద్రనగర్  పోలీసులు.  గత వారం రోజుల క్రితం ఘటన జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజేంద్ర నగర్‌ పోలీసులు. అసలు యువతి ఎవరు? పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న వారు ఏవరు? ఎవరెవరు ఇక్కడికి వచ్చారు? పూర్తి సమాచారాన్ని స్వేకరిస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.  అపార్ట్‌ మెంట్ లో ఉన్న సిసి ఫూటేజ్ ను పరిశీ లిస్తున్నారు రాజేంద్రనగర్  పోలీసులు. యువతి ది ఆత్మ హత్యా ? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మ హత్య గా చి త్రీకరించారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్  పోలీసులు. దీని పై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్  పోలీసులు... దర్యాప్తును ముమ్మరం చేశారు. 24 గంటల్లోనే నిందితున్ని పట్టుకుంటామని చెబుతున్నారు రాజేంద్రనగర్  పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: