మద్యం మత్తులో చాలా మంది ఎన్నో అనర్దాలకు పాల్పడుతూ ఉంటారు. కొంతమంది మత్తులో ఉండి తాము ఏం చేసిన నడుస్తుందని అనుకుంటూ ఉంటారు. అదే కోణంలో ఓ వ్యక్తిపై రౌడీయిజం చూయించిన గ్యాంగ్ జైలు పాలైయినా సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పొందుర్తి గ్రామ శివారులోని ఓ దాబా వద్ద టేక్రియాల్ కు చెందిన సంతోష్ తో పాటు అతని స్నేహితులు భోజనం చేసేందుకు కార్ పార్క్ చేసి లోపలికి వెళ్లారు.

ఇక సంతోష్‌తో పాటు అతని స్నేహితులు భోజనం చేసి బయటకు వస్తుండగా కారు పై జనార్దన్ అనే వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. దీంతో కోపానికి గురైన సంతోష్ కారు కనిపించడం లేదా అని అనడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అంతలోనే జనార్ధన్ స్నేహితులైన సాజిద్, రవీందర్ లు సంతోష్ తో పాటు అతని స్నేహితులతో కొట్లాకు దిగారు. అంతేకాక.. సాజిద్ అతని వద్ద ఉన్న తుపాకిని తీసి సంతోష్ తలకు పెట్టి చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేశాడు.

దాంతో భయభ్రాంతులకు గురైన సంతోష్ అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సాజిద్, రవీందర్, జనార్ధన్ లను  పట్టుకొని వారి వద్ద ఉన్న ఒక పిస్తోల్ 7 బుల్లెట్ లు, ఒక కారు, మూడు సెల్ ఫోన్ లను  స్వాధీన పరచుకున్నారు. అయితే సాజిద్, కామారెడ్డి పట్టణ పరిధిలో పలు నేరాలు చేసి జైలుకు వెళ్లినట్లు సమాచారం.

అంతేకాదు.. కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో  రౌడీషీటర్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో బెదిరింపులు చేస్తూ.. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక గతంలో పలుసార్లు బైండోవర్లు చేసినా తీరు మారలేదని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు మరోసారి సాజిద్ అండ్‌ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: