మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఫాక్షన్ సినిమాలలో పగ ప్రతీకారం అనేది కనిపిస్తూ ఉంటుంది. సినిమాలో రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల నుంచి పగ కొనసాగుతూ వస్తుంది. ఇక ఒక ఫ్యామిలీ వారు మరొక ఫ్యామిలీనీ సమయం చూసి హత్య చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి చూసినపుడు నిజ జీవితంలో ఇలాంటివి ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో మనుషుల్లో కూడా పగ ప్రతీకారాలు పెరిగిపోయాయి అన్నదానికి ఎన్నో ఘటనలు నిదర్శనంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. పగ ప్రతీకారాలు పెరిగిపోవడంతో  దారుణంగా సాటి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు ఎంతోమంది. ఇలాంటి ఘటనలు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి పగ ప్రతీకారాల తో రగిలిపోయాడు ఆ వ్యక్తి శత్రువులపై ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి అని అనుకున్నాడు.. ఈ క్రమంలోనే కత్తితో పొడవడం  తుపాకీతో కాల్చటం   లాంటివి కాదు కాస్త కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడు. ఏకంగా బాంబు పేలిస్తే  ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా ముగ్గురూ ఒకేసారి చనిపోతారు అని ప్లాన్ వేశాడు. కానీ బాంబు తయారు చేయడం రాదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో యూట్యూబ్ అతనికి గుర్తొచ్చింది. ఇక యూట్యూబ్ లో చూసి బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు. దీంతో అతను చంపాలనుకున్న ముగ్గురు వ్యక్తులను ప్రాణాలు తీసేందుకు బాంబు పేల్చాడు.



 ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. గతంలో సదరు వ్యక్తి భార్య పై ముగ్గురు దుర్మార్గులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ సమయంలో అతన్ని దారుణంగా చితకబాదారు. ఆ తర్వాత కాలంలో తన భార్యపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ముగ్గురిపై ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ రగిలిపోయాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే ఇంటర్నెట్లో చూసి బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఇక ఒకే దెబ్బకు ముగ్గురిని చంపేయాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ప్లాన్ ప్రకారం బాంబు పేల్చాడు. కానీ ఈ ఘటనలో ఒకే ఒక వ్యక్తి మాత్రమే మరణించాడు. దీంతో  అప్రమత్తమైన పోలీసులు బాంబు పేల్చిన వ్యక్తితో పాటు అత్యాచారానికి పాల్పడిన మరో ఇద్దరు నిందితులనూ కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: