నేటి సమాజంలో వివాహేతర సంబంధాల కారణంగా చాలా మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ భార్య భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం గోకవరంకు చెందిన వ్యక్తికి వంగలపూడికి చెందిన మహిళతో పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ మహిళా జీవనోపాధి కోసం కువైట్ కి వెళ్ళింది. ఇక ఆమె భర్త స్వగ్రామంలో ఉంటూ ఆటో నడుపుతుండగా.. పిల్లలు అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం పిల్లల దగ్గరకు వెళ్లిన తండ్రి.. కొడుకుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే  కువైట్ లో ఉన్న భార్యకు.. రాజమహేంద్రవరంకు చెందిన కానిస్టేబుల్ లక్ష్మణరావుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే లక్ష్మణరావు తరచూ మహిళను ఇక్కడికి రప్పించి ఆమెను ఏకాంతంగా కలుస్తుంటాడు. ఇక ఇదిలా ఉంటే మహిళ ప్రైవేట్ ఫోటోలను కానిస్టేబుల్ ఆమె బంధువులకు సోషల్ మీడియాలో పంపించాడు. ఈ ఫోటో చూసిన మహిళ భర్త మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు అతడి బంధువులు వెల్లడించారు.

ఇక ఈ సమయంలో అసభ్య ఫోటోలు, వీడియోల సంగతి బంధువులు.. కువైట్ లో ఉన్న మహిళకు తెలిపారు. అంతేకాక.. భర్త, పిల్లలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కూడా తెలిపారు. బంధువుల విషయం చెప్పిన తరువాత ఆమె అక్కడే గుర్తుతెలియని మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. అది గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే  ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారి అయిన కానిస్టేబుల్ లక్ష్మణరావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: