మేము కూడా ఒక హత్య చేసి దానికి సంబంధించిన వీడియో సోషల్ వీడియోలు పెడితే మేము ఎంతగానో ఫేమస్ కావచ్చు అని అనుకున్నారు. కానీ అది తప్పు అలా చేయకూడదు అని మాత్రం ఆలోచించలేక పోయారు. చివరికి ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి పోలీసులకు చిక్కారు. దీంతో ఆ ముగ్గురు కుర్రాళ్ళు చెప్పిన నిజాలతో నోరెళ్ళబెట్టడం పోలీసుల వంతయింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జహంగీర్ పురి ప్రాంతంలో ముగ్గురూ కలిసి ఒక అమాయకుడిని దారుణంగా హత్య చేశారు. అయితే ఇలా హత్య చేసిన మొత్తాన్ని కూడా సెల్ఫోన్లో చిత్రీకరించి.. ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఎంతగానో పేరు తెచ్చుకోవాలి అన్నది వారి కోరిక. ఈ విషయాన్ని పోలీస్ విచారణలో బయట పెట్టారు.
జహంగీర్ పురి ప్రాంతానికి చెందిన శిబు కాలనిలో ఒంటరిగా కనిపించడంతో ముగ్గురు కుర్రాళ్ళు అనవసరంగా అతని తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఒక యువకుడు ఇదంతా సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా ఇక ఇద్దరు యువకులు ఏకంగా కర్రలతో దారుణంగా దాడి చేశారు. అంతేకాకుండా తన దగ్గర ఉన్నటువంటి బాకుతో అతని కడుపులో పొడిచారూ. దీంతో ఇదంతా వీడియో తీసుకుని చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోయారూ. చావు బతుకుల మధ్య ఉన్న సదరు వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.. సిసిటివి ఫుటేజీ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అయితే ముగ్గురు కుర్రాళ్ళు కూడా తమ ముఠా కి బద్నాం గ్యాంగ్ అంటూ పేరు పెట్టుకోవడం గమనార్హం.